Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన.. హామీల అమలులో ఘోర వైఫల్యం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 08:30 PM

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: సీఐ మన్మధ కుమార్

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: సీఐ మన్మధ కుమార్

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: సీఐ మన్మధ కుమార్
02-09-2026 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

శ్రీ జయ ల్యాబ్స్‌లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ సూచించారు. మల్కాపూర్ పరిధిలోని శ్రీ జయ ల్యాబ్స్ కంపెనీలో చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో బుధవారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ​ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ... ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించాలని స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగంతో వెళ్లడం, డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ మాట్లాడటం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల కుటుంబాలు రోడ్డున పడతాయని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ పోలీస్ సిబ్బంది, శ్రీ జయ ల్యాబ్స్ కంపెనీ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: సీఐ మన్మధ కుమార్

Article Image

శ్రీ జయ ల్యాబ్స్‌లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ సూచించారు. మల్కాపూర్ పరిధిలోని శ్రీ జయ ల్యాబ్స్ కంపెనీలో చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో బుధవారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ​ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ... ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించాలని స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగంతో వెళ్లడం, డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ మాట్లాడటం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల కుటుంబాలు రోడ్డున పడతాయని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ పోలీస్ సిబ్బంది, శ్రీ జయ ల్యాబ్స్ కంపెనీ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News