ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా చౌటుప్పల్లోని జయశ్రీ గార్డెన్స్లో జనసేన ఆధ్వర్యంలో బుధవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ నాయకుడు ఆముదాల పరమేశ్ ఆధ్వర్యంలో, బడుగు శ్రీరాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 80 మంది వృద్ధులకు చేతికర్రలు, స్టాండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా జనసేన పార్టీ ఇన్చార్జ్ మేకల సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సతీష్ రెడ్డి, పరమేశ్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఆర్భాటాలకు పోకుండా, పేదలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాల రూపంలో నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. చేతికర్రలు అందుకున్న వృద్ధులు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పీక ప్రవీణ్ కుమార్, పల్చం శ్రీకాంత్, బొల్లం మల్లేశ్, పెద్దగొని లింగస్వామి, ప్రశాంత్, బద్రి రాజు, కునూరు శ్రీకాంత్, సంజయ్, కృష్ణారెడ్డి, సుల్తాన్ రాజు, రమణబాబు, శివరామ్, నిఖిల్, తేజ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు- వృద్ధులకు చేతికర్రలు, స్టాండ్ల పంపిణీ
ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు- వృద్ధులకు చేతికర్రలు, స్టాండ్ల పంపిణీ
K.RAVI
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా చౌటుప్పల్లోని జయశ్రీ గార్డెన్స్లో జనసేన ఆధ్వర్యంలో బుధవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ నాయకుడు ఆముదాల పరమేశ్ ఆధ్వర్యంలో, బడుగు శ్రీరాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 80 మంది వృద్ధులకు చేతికర్రలు, స్టాండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా జనసేన పార్టీ ఇన్చార్జ్ మేకల సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సతీష్ రెడ్డి, పరమేశ్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఆర్భాటాలకు పోకుండా, పేదలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాల రూపంలో నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. చేతికర్రలు అందుకున్న వృద్ధులు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పీక ప్రవీణ్ కుమార్, పల్చం శ్రీకాంత్, బొల్లం మల్లేశ్, పెద్దగొని లింగస్వామి, ప్రశాంత్, బద్రి రాజు, కునూరు శ్రీకాంత్, సంజయ్, కృష్ణారెడ్డి, సుల్తాన్ రాజు, రమణబాబు, శివరామ్, నిఖిల్, తేజ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి