రామన్నపేట
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీఎస్యూటీఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి కంచి రవికుమార్ డిమాండ్ చేశారు. రామన్నపేట మండలంలోని వివిధ పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు.మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను వెంటనే విడుదల చేయడంతో పాటు పీఆర్సీని అమలు చేయాలని, సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని కోరారు. హెల్త్కార్డులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, జీవో నంబర్ 25ను సవరించాలని, 317 బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే సెప్టెంబర్ 10న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో సీనియర్ నాయకులు మోహన్రెడ్డి, కట్ట కృష్ణ, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ అనిల్కుమార్, మండల ప్రధాన కార్యదర్శి మంకాల కుమారస్వామి, ఉపాధ్యక్షుడు ఘాసిరాం, కోశాధికారి కర్నె త్రివేణి ప్రసాద్, ఎఫ్డబ్ల్యూఎస్ మండల కన్వీనర్ మధుబాబు, సీనియర్ నాయకుడు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి