Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కేసీఆర్‌ పనులకు రిబ్బన్‌ కట్‌ చేయడమేనా? ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 02:21 PM

ప్రజల గుండెల్లో చిరస్థాయి వైఎస్సార్.. ఔదత్‌పూర్‌లో ఘనంగా వర్ధంతి వేడుకలు

ప్రజల గుండెల్లో చిరస్థాయి వైఎస్సార్.. ఔదత్‌పూర్‌లో ఘనంగా వర్ధంతి వేడుకలు

ప్రజల గుండెల్లో చిరస్థాయి వైఎస్సార్.. ఔదత్‌పూర్‌లో ఘనంగా వర్ధంతి వేడుకలు
02-09-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నాగల్‌గిద్ద మండలంలోని ఔదత్‌పూర్ గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, జననేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతిని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు వైఎస్సార్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. ముఖ్యంగా రైతుల సంక్షేమానికి, పేదల ఆరోగ్యానికి, విద్యార్థుల విద్యాభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజల కోసం నిరంతరం పనిచేసిన మహానేతగా వైఎస్సార్ ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతారని అన్నారు. ఆయన ఆశయాలను, ప్రజా సంక్షేమ పాలనను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నర్సింగ్ రావు, సర్పంచ్ అంబాజీ, సంతోష్, బి. శంకర్, వై. పండరి, అబ్దుల్ రహీం, యూసుబ్ సాబ్, వై. ఆర్జన్, బి. ధర్మ, నవాబ్ మియా, రామప్పతో పాటు గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, వైఎస్సార్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజల గుండెల్లో చిరస్థాయి వైఎస్సార్.. ఔదత్‌పూర్‌లో ఘనంగా వర్ధంతి వేడుకలు

Article Image

నాగల్‌గిద్ద మండలంలోని ఔదత్‌పూర్ గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, జననేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతిని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు వైఎస్సార్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. ముఖ్యంగా రైతుల సంక్షేమానికి, పేదల ఆరోగ్యానికి, విద్యార్థుల విద్యాభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజల కోసం నిరంతరం పనిచేసిన మహానేతగా వైఎస్సార్ ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతారని అన్నారు. ఆయన ఆశయాలను, ప్రజా సంక్షేమ పాలనను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నర్సింగ్ రావు, సర్పంచ్ అంబాజీ, సంతోష్, బి. శంకర్, వై. పండరి, అబ్దుల్ రహీం, యూసుబ్ సాబ్, వై. ఆర్జన్, బి. ధర్మ, నవాబ్ మియా, రామప్పతో పాటు గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, వైఎస్సార్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News