కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం పై కాంగ్రెస్ పార్టీ నాయకుడు రావెళ్ల కృష్ణారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పద్మావతి రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాజకీయ విమర్శలకు ఒక హద్దు ఉంటుందని, వ్యక్తిగత విమర్శలు, నిరాధార ఆరోపణలకు పాల్పడటం రాజకీయ సంస్కారం కాదని మండిపడ్డారు. ప్రజల్లో గౌరవం ఉన్న నాయకులపై నోటికొచ్చినట్లు మాట్లాడటం తగదని హితవు పలికారు.
“కాంగ్రెస్ పార్టీ కోసం రూ.5 కోట్లు తీసుకున్నారనే ఆరోపణలకు ముందుగా సమాధానం చెప్పాలి. పార్టీని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలకు ఏం సమాధానం చెబుతారు?” అని రావెళ్ల కృష్ణారావు ప్రశ్నించారు.ఆరోపణలకు సమాధానం చెప్పకుండా రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు కాకుండా వాస్తవాలను ప్రజల ముందుంచాలని సూచించారు. వ్యక్తిగత విమర్శలు, పరస్పర ఆరోపణలతో రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేయవద్దని హితవు పలికారు. మాజీ ఎమ్మెల్యే ముందుగా తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పి, అనంతరం కాంగ్రెస్ నాయకులపై మాట్లాడాలని రావెళ్ల కృష్ణారావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై అనుచిత వ్యాఖ్యలను సహించేది లేదని, పార్టీ శ్రేణులు ఐక్యంగా ఎదుర్కొంటాయని ఆయన స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి