నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలో చెరువులు, కుంటలను నింపేందుకు నీటిని విడుదల చేసినప్పటికీ, కోదాడ మండల పరిధిలోని కొత్తగూడెం మేజర్ చివరి ఆయకట్టు రైతులకు నీరందక తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోల్లు ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కోదాడ నీటిపారుదల శాఖ ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)కి రైతు సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బోల్లు ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం నీటిని విడుదల చేసినా కోదాడ మండలంలోని కొత్తగూడెం మేజర్ పరిధిలో ఉన్న తమ్మర,బండపాలెం తో పాటు పలు గ్రామాలకు నీరు సరిపడా రావడం లేదన్నారు. దీనివల్ల నేటి వరకు కూడా ఆయా గ్రామాల పరిధిలోని చెరువులు నిండని పరిస్థితి నెలకొందని తెలిపారు. సాగునీరు అందక రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కాలువల ద్వారా పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసి, చెరువులను నింపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు సజ్జ సుబ్బారావు, సామినేని రమేష్, సామినేని సతీష్, బొల్లు నరేష్, బత్తినేని రమేష్, మందులపు రమేష్, కనగాల పూర్ణచంద్రరావు, కమతం సైదయ్య తదితరులు పాల్గొన్నారు...........

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి