మున్సిపల్ కార్యాలయంలోని టౌన్ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న వేళ పలువురు అధికారులు, సిబ్బంది కార్యాలయంలో అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. గురువారం ఉదయం 10.30 గంటలు దాటినా కొందరు అధికారులు విధులకు హాజరుకాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
టౌన్ప్లానింగ్ విభాగంలో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్న సమయంలో సంబంధిత అధికారులు కార్యాలయంలో లేకపోవడానికి కారణమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు హాజరు రిజిస్టర్లో సంతకాలు ఉన్నప్పటికీ కొందరు సిబ్బంది కార్యాలయంలో కనిపించకపోవడం కూడా చర్చకు దారితీసింది.
విధి నిర్వహణలో భాగంగా నిర్ణీత సమయానికి అధికారులు, సిబ్బంది కార్యాలయంలో అందుబాటులో ఉండాల్సి ఉండగా.. ఏసీబీ తనిఖీలు జరుగుతున్న కీలక సమయంలోనే గైర్హాజరు కావడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు. హాజరు రిజిస్టర్తో పాటు బయోమెట్రిక్ వివరాలను పరిశీలిస్తే వాస్తవ పరిస్థితి స్పష్టమవుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి