సాగునీరు, కరెంట్, యూరియా విషయంలో రైతులను ఇబ్బందులకు గురిచేశారు.
మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.
నార్కట్పల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో రైతులకు తీరని అన్యాయం చేసిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నార్కట్పల్లి పట్టణంలోని శబరి గార్డెన్స్లో గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు. సుమారు 2 వేల మంది పార్టీ శ్రేణులు, రైతులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు విఫలమయ్యాయని, ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. నాగార్జునసాగర్లో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ రైతులకు సరిపడా సాగునీరు అందించకపోవడంతో పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.
కరెంట్ కోతలతో మోటార్లు కాలిపోయే పరిస్థితి.
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించడం లేదని, తరచూ విద్యుత్ కోతలు, లో-వోల్టేజీ సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. లో-వోల్టేజీ కారణంగా వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
యూరియా కోసం రైతుల అవస్థలు.
రైతులకు నేరుగా యూరియా అందించకుండా ఆన్లైన్ లింకులు, ఇతర నిబంధనలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రైతులకు అందాల్సిన యూరియాను బ్లాక్మార్కెట్కు తరలించే పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించారు. అలాగే రైతు బీమా పాలసీలను సకాలంలో రెన్యువల్ చేయకుండా రైతులను ప్రభుత్వం మోసం చేసిందని చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు.
రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, సాగునీరు, నాణ్యమైన విద్యుత్, ఎరువులు, రైతు బీమా వంటి అంశాలపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి