ముగ్గురు సభ్యుల దొంగల ముఠా అరెస్ట్.. భారీగా సొత్తు స్వాధీనం.
నల్గొండ: జల్సాల కోసం తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను నల్గొండ వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితులు గత రెండు నెలల్లో పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఐదు చోరీలకు పాల్పడినట్లు విచారణలో అంగీకరించారు.
వారి నుంచి 30 తులాల వెండి ఆభరణాలు, 4 గ్యాస్ సిలిండర్లు, 3 బ్యాటరీలు, 4 సెల్ఫోన్లు, రూ.14,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురికీ గతంలో నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
డీఎస్పీ కె. శివరాం రెడ్డి ఆదేశాలతో వన్టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు సైదులు, వెంకట్ నారాయణ, సిబ్బంది నిందితులను పట్టుకున్నారు. వారిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి