స్థానిక నారాయణ ఉన్నత పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈ-ఛాంప్స్ ఆర్ అండ్ డి హెడ్ సంగీత ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ద్వాపరయుగంలో ప్రజలను పీడించిన కంసుడిని సంహరించి ధర్మసంస్థాపన చేసేందుకు భాద్రపద మాసం, కృష్ణ పక్ష అష్టమి, రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడని వివరించారు. చెరసాలలో జన్మించిన బాలకృష్ణుడిని వసుదేవుడు యమునా నది దాటించి గోకులంలోని యశోదా-నందుల వద్దకు చేర్చిన వైనాన్ని విద్యార్థులకు తెలియజేశారు. "ధర్మం ఎల్లప్పుడూ విజయం సాధిస్తుంది, అధర్మం ఎప్పటికీ నిలవదు" అనే గొప్ప సందేశాన్ని కృష్ణుని జీవితం మనకు అందిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నవనీత, వైస్ ప్రిన్సిపల్స్ క్రాంతి, మాధవి, అకడమిక్ డీన్ వెంకన్న, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బాతరాజు వెంకటేశం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నారాయణ హైస్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు
నారాయణ హైస్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు
K.RAVI
స్థానిక నారాయణ ఉన్నత పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈ-ఛాంప్స్ ఆర్ అండ్ డి హెడ్ సంగీత ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ద్వాపరయుగంలో ప్రజలను పీడించిన కంసుడిని సంహరించి ధర్మసంస్థాపన చేసేందుకు భాద్రపద మాసం, కృష్ణ పక్ష అష్టమి, రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడని వివరించారు. చెరసాలలో జన్మించిన బాలకృష్ణుడిని వసుదేవుడు యమునా నది దాటించి గోకులంలోని యశోదా-నందుల వద్దకు చేర్చిన వైనాన్ని విద్యార్థులకు తెలియజేశారు. "ధర్మం ఎల్లప్పుడూ విజయం సాధిస్తుంది, అధర్మం ఎప్పటికీ నిలవదు" అనే గొప్ప సందేశాన్ని కృష్ణుని జీవితం మనకు అందిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నవనీత, వైస్ ప్రిన్సిపల్స్ క్రాంతి, మాధవి, అకడమిక్ డీన్ వెంకన్న, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బాతరాజు వెంకటేశం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి