చైతన్యపురి: గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీసులు నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి, ఐపీఎస్ ఆదేశాల మేరకు చైతన్యపురి పోలీస్స్టేషన్లో గురువారం గణేష్ ఉత్సవ నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ కే.సైదులు మాట్లాడుతూ.. గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపన, ఆగమనం, ఊరేగింపు, నిమజ్జనానికి ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా నిర్వాహకులు తగిన చర్యలు చేపట్టాలన్నారు.
డీజేలు, సౌండ్ సిస్టమ్లపై ఆంక్షలు.
ప్రభుత్వ నిబంధనల మేరకు శబ్ద పరిమితులను పాటించాలని స్పష్టం చేశారు. పరిమితికి మించి డీజేలు వినియోగించి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్దేశించిన తేదీల్లోనే నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు.
ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నిర్వాహకులను కోరారు. భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించేందుకు పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. సమావేశంలో ఉత్సవ నిర్వాహకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి