హాజరైన మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ గౌడ్
భవాని నగర్ లోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రావణమాసం నాలుగవ శుక్రవారం పురస్కరించుకుని కుంకుమార్చన కార్యక్రమం వైభవంగా జరిగింది. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో, ట్రినిటీ విద్యాలయాల సంస్థ, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సౌజన్యంతో ఈ వేడుకను నిర్వహించారు. ప్రత్యేకంగా కాశీ నుంచి తెప్పించిన శ్రీచక్రములపై మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన పూజలు చేశారు. వేద పండితులు పెద్ది సుధాకర్ శర్మ వేద మంత్రోచ్ఛరణల నడుమ ఈ కార్యక్రమం కన్నులపండువగా సాగింది. ఈ పూజా కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శ్రీ భవాని మాత దివ్య ఆశీస్సుల కోసం కుంకుమార్చనలో పాల్గొన్న మహిళా భక్తులందరికీ అమ్మవారి కృపాకటాక్షాలు కలగాలని ఆకాంక్షించారు. చౌటుప్పల్ మున్సిపల్ ప్రజలంతా అమ్మవారి దయతో ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన దేవాలయ కమిటీ ధర్మకర్తలను ఆమె ఈ సందర్భంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ బొబ్బిళ్ళ మురళి గురుస్వామి, మున్సిపల్ వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్, కౌన్సిలర్స్ పిల్లలమర్రి మధుసూదన్, బత్తుల వాణి విప్లవ్ గౌడ్, కాసర్ల మంజుల, కోఆప్షన్ సభ్యురాలు సందగళ్ళ విజయ, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అధ్యక్షురాలు వెన్ రెడ్డి సంధ్య, ట్రినిటీ విద్యాలయాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జీనీ మంజుల, పెద్ది స్వాతి కిషోర్ శర్మ, ధర్మకర్తలు వర్కాల రవి గౌడ్, ఆవుల యేసు యాదవ్, దాడి యశ్వంత్ రెడ్డి, గగులోతు అరుణ, బొబ్బిళ్ళ సంధ్య, వర్కాల వెన్నెల, పబ్బు శ్రీకాంత్ గౌడ్, మోగుదాల వెంకటేష్ గౌడ్, మునుకుంట్ల పద్మావతి, సుర్వి మంజుల, దాడి పద్మ, ముటుకులోజు నీరజ, వనం మమత, సింగిరి కొండశైలజ, బడుగు గౌరీశ్వరి, బొబ్బిళ్ళ యశోద, మన్నె శివరాణి, బొడిగ రాధిక, పగడాల అనూష, మామిడి వెంకటమ్మ, శాలిని, అనూష, ప్రసన్నలక్ష్మి, జూకంటి రేవతి, ఎలమొని హారిక, కాసాని ఐలమ్మ, కీర్తన, పార్సి సంధ్య, పార్షి నికిత, బొబ్బిళ్ళ సామ్రాట్, మునుకుంట్ల శేఖర్ గౌడ్, డాకోజి అజయ్ తదితర భక్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి