Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో చేసిందేమీ లేదు. నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 04, 2026 03:42 PM

వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో చేసిందేమీ లేదు.

వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో చేసిందేమీ లేదు.

వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో చేసిందేమీ లేదు.
04-09-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఆరు గ్యారంటీలు.. 420 హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు.

నకిరేకల్‌లో బీఆర్‌ఎస్ మహిళా సదస్సులో చిరుమర్తి లింగయ్య ధ్వజం.

నకిరేకల్, సెప్టెంబర్ 4: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తీవ్ర అన్యాయం చేసిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నకిరేకల్ పట్టణంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా సదస్సులో ఆయన మాట్లాడారు. సుమారు 1,500 మంది మహిళలు, పార్టీ శ్రేణులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.2,500, విద్యార్థులకు స్కూటీలు, కంప్యూటర్లు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించారని అన్నారు. వృద్ధుల పింఛన్‌ను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు, వికలాంగుల పింఛన్‌ను రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచుతామని చెప్పి మోసం చేశారని విమర్శించారు.

ఇందిరమ్మ ఇళ్ల విషయంలోనూ పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటేనే ఇళ్లు ఇస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా చేపట్టిన అభివృద్ధి పనులు పెద్దగా లేవని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులనే కొనసాగిస్తున్నారని అన్నారు.

నకిరేకల్ పట్టణంలో రూ.36 కోట్లతో 100 పడకల ఆస్పత్రికి మాజీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధికి నిదర్శనమన్నారు. ‘అభివృద్ధి అంటే చిరుమర్తి లింగయ్య’ అనే స్థాయిలో నకిరేకల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్‌ఎస్ నాయకులు, మహిళలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Sthanikam

వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో చేసిందేమీ లేదు.

Article Image

ఆరు గ్యారంటీలు.. 420 హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు.

నకిరేకల్‌లో బీఆర్‌ఎస్ మహిళా సదస్సులో చిరుమర్తి లింగయ్య ధ్వజం.

నకిరేకల్, సెప్టెంబర్ 4: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తీవ్ర అన్యాయం చేసిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నకిరేకల్ పట్టణంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా సదస్సులో ఆయన మాట్లాడారు. సుమారు 1,500 మంది మహిళలు, పార్టీ శ్రేణులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.2,500, విద్యార్థులకు స్కూటీలు, కంప్యూటర్లు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించారని అన్నారు. వృద్ధుల పింఛన్‌ను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు, వికలాంగుల పింఛన్‌ను రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచుతామని చెప్పి మోసం చేశారని విమర్శించారు.

ఇందిరమ్మ ఇళ్ల విషయంలోనూ పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటేనే ఇళ్లు ఇస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా చేపట్టిన అభివృద్ధి పనులు పెద్దగా లేవని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులనే కొనసాగిస్తున్నారని అన్నారు.

నకిరేకల్ పట్టణంలో రూ.36 కోట్లతో 100 పడకల ఆస్పత్రికి మాజీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధికి నిదర్శనమన్నారు. ‘అభివృద్ధి అంటే చిరుమర్తి లింగయ్య’ అనే స్థాయిలో నకిరేకల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్‌ఎస్ నాయకులు, మహిళలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News