ఇద్దరు నిందితుల అరెస్ట్.. బంగారు పుస్తెలతాడు, బైక్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం
మేడిపల్లి: శాంతివనం, చెంగిచెర్లలో జరిగిన బంగారు గొలుసు చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్కు చెందిన మేడిపల్లి పోలీసులు కేవలం 20 గంటల్లోనే ఛేదించారు. ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. కంగాల వి.వి.ఎస్.వి. ప్రసాద్ (39), అజ్మీరా వెంకటేష్ (24)లను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుంచి 3 తులాల బంగారు పుస్తెలతాడు, ఒక ద్విచక్ర వాహనం, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సీసీటీవీ కెమెరాల ఫుటేజీని విశ్లేషించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసును వేగంగా ఛేదించిన మేడిపల్లి పోలీసుల చర్యపై పలువురు అభినందనలు వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి