రామన్నపేట ప్రభుత్వాసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి, నూతన భవన నిర్మాణానికి అసెంబ్లీ సమావేశాల్లో నిధులు కేటాయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.డి. జహంగీర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆసుపత్రి ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
ఆసుపత్రిలో సరిపడా పడకలు, వైద్య సిబ్బంది, మౌలిక వసతులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నకిరేకల్ సభలో సీఎం రేవంత్రెడ్డి 100 పడకల ఆసుపత్రిపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. మంత్రి కోమటిరెడ్డి ఆరు నెలల్లో పనులు పూర్తి చేస్తామని ప్రకటించి రెండు నెలలు గడిచినా పురోగతి లేదని విమర్శించారు. ఆసుపత్రి అభివృద్ధి జరిగే వరకు ప్రజలతో కలిసి ఉద్యమం కొనసాగిస్తామని జహంగీర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, మండల కార్యదర్శివర్గ సభ్యులు కందుల హనుమంతు, కల్లూరి నగేష్, మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బుర్రు అనిల్కుమార్, మండల నాయకులు గొరిగే సోములు, గాదె నరేందర్, నీల అయిలయ్య, తోలుపునూరి శ్రీనివాస్, శాఖ కార్యదర్శి మునికుంట్ల లెనిన్, డీవైఎఫ్ఐ మండల అధ్యక్షుడు శానగొండ రాము, పల్లె సత్యం, బావండ్లపల్లి సత్యం, ఎండీ లతీఫ్, ఆముద ఆంజనేయులు, జల్లెల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి