మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం.
రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన పోచబోయిన మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామ మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. అనివార్య కారణాల వల్ల తాను స్వయంగా హాజరు కాలేకపోయినప్పటికీ, మల్లయ్య అంత్యక్రియల నిమిత్తం మృతుని కుటుంబ సభ్యులకు రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.
ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించడం పట్ల గ్రామస్థులు మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎడ్ల నరేందర్ రెడ్డి, ఎడ్ల కృష్ణారెడ్డి, పర్నాటి మాధవరెడ్డి, పిట్ట మహేందర్ రెడ్డి, పినికెసి గోపాల్ రెడ్డితో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి