Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉపాధ్యాయుడే సమాజానికి దిక్సూచి భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 05, 2026 06:08 PM

ఉపాధ్యాయుడే సమాజానికి దిక్సూచి

ఉపాధ్యాయుడే సమాజానికి దిక్సూచి

ఉపాధ్యాయుడే సమాజానికి దిక్సూచి
05-09-2026 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఆశయాలు ఆదర్శం.. నాణ్యమైన విద్యతో విలువలు పెంపొందించాలి.

నల్లగొండ: భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి, ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయంప్రతిపత్తి)లో శుక్రవారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్ల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డా. పరంగి రవికుమార్‌ మాట్లాడుతూ.. దేశానికి రాధాకృష్ణన్‌ అందించిన విద్యా సేవలు, తాత్విక ఆలోచనలు చిరస్మరణీయమన్నారు. ఉపాధ్యాయుడు కేవలం పాఠ్యాంశాలను బోధించే వ్యక్తి కాదని, విద్యార్థుల్లో జ్ఞానం, క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించే మార్గదర్శి అని పేర్కొన్నారు. రాధాకృష్ణన్‌ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని సూచించారు.ప్రొఫెసర్‌ అంతటి శ్రీనివాసులు మాట్లాడుతూ..

రాధాకృష్ణన్‌ జీవితం, విద్యా తత్వం నేటి తరానికి ఆదర్శప్రాయమన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మానవీయ విలువలు, బాధ్యతాయుత పౌరసత్వాన్ని అలవర్చడం ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మరింత నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ అధికారులు నర్సింగ్‌ కోటయ్య, వెంకటరెడ్డి, డా. అదే మల్లేశం, శివరాణి, బొజ్జ అనిల్‌కుమార్‌తో పాటు అధ్యాపకులు హబీబ్‌, జాజుల దినేష్‌, నాగరాజు కదిరే, హశ్రత్‌ బేగం, వంశీ, పావని, ఎన్‌ఎస్‌ఎస్‌ స్వచ్ఛంద సేవకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉపాధ్యాయుడే సమాజానికి దిక్సూచి

Article Image

సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఆశయాలు ఆదర్శం.. నాణ్యమైన విద్యతో విలువలు పెంపొందించాలి.

నల్లగొండ: భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి, ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయంప్రతిపత్తి)లో శుక్రవారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్ల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డా. పరంగి రవికుమార్‌ మాట్లాడుతూ.. దేశానికి రాధాకృష్ణన్‌ అందించిన విద్యా సేవలు, తాత్విక ఆలోచనలు చిరస్మరణీయమన్నారు. ఉపాధ్యాయుడు కేవలం పాఠ్యాంశాలను బోధించే వ్యక్తి కాదని, విద్యార్థుల్లో జ్ఞానం, క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించే మార్గదర్శి అని పేర్కొన్నారు. రాధాకృష్ణన్‌ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని సూచించారు.ప్రొఫెసర్‌ అంతటి శ్రీనివాసులు మాట్లాడుతూ..

రాధాకృష్ణన్‌ జీవితం, విద్యా తత్వం నేటి తరానికి ఆదర్శప్రాయమన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మానవీయ విలువలు, బాధ్యతాయుత పౌరసత్వాన్ని అలవర్చడం ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మరింత నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ అధికారులు నర్సింగ్‌ కోటయ్య, వెంకటరెడ్డి, డా. అదే మల్లేశం, శివరాణి, బొజ్జ అనిల్‌కుమార్‌తో పాటు అధ్యాపకులు హబీబ్‌, జాజుల దినేష్‌, నాగరాజు కదిరే, హశ్రత్‌ బేగం, వంశీ, పావని, ఎన్‌ఎస్‌ఎస్‌ స్వచ్ఛంద సేవకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News