రామన్నపేట,
జలసిరి పనుల్లో కూలీలకు ఎక్కువ పనిదినాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని డీఆర్డీఓ నాగిరెడ్డి సూచించారు. శనివారం రామన్నపేట మండలంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా ఫారంపాండ్ పనులను విస్తృతంగా చేపట్టి కూలీలకు ఉపాధి కల్పించాలని తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీలో 40 నుంచి 60 మంది కూలీలకు పనులు లభించేలా అధికారులు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. గ్రామాల్లో అవసరమైన పనులను గుర్తించి, ఉపాధి పనులు నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.సమావేశంలో ఎంపీడీఓ రాములు, ఎంపీఓ రఫీ, ఏపీఓ వెంకన్న, టెక్నికల్ అసిస్టెంట్లు ప్రవీణ్, హరికృష్ణ, మధు, సుచరిత, కంప్యూటర్ ఆపరేటర్లు యాదగిరి, ఉమ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి