ఘనంగా ఎల్లంకిలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.
రామన్నపేట మండలంలోని ఎల్లంకి గ్రామంలోని పిఎంఎస్హెచ్ఆర్ఐ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా తూటి మురళీధర్ హాజరయ్యారు. తలారి లింగయ్య సహాయ సహకారాలు అందించారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు తంగేళ్ల సురేందర్రెడ్డితో పాటు ఉపాధ్యాయులను తూటి మురళీధర్, తలారి లింగయ్యలు ఘనంగా సన్మానించారు. అనంతరం మురళీధర్ మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకుని పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ను ఆదర్శంగా తీసుకుని నైతిక విలువలు, క్రమశిక్షణను అలవర్చుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి