Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సీఎం సభ వేళ.. మాజీ ఎమ్మెల్యే హౌస్‌ అరెస్ట్‌ నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 05, 2026 02:10 PM

ఓటరు జాబితా సవరణను సద్వినియోగం చేసుకోవాలి. తాసిల్దార్ లాల్ బహుదూర్

ఓటరు జాబితా సవరణను సద్వినియోగం చేసుకోవాలి. తాసిల్దార్ లాల్ బహుదూర్

ఓటరు జాబితా సవరణను సద్వినియోగం చేసుకోవాలి. తాసిల్దార్ లాల్ బహుదూర్
05-09-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నిదానపల్లిలో ఘనంగా SIR అవగాహన సదస్సు.

నిదానపల్లి, సెప్టెంబర్ 5: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR-2026)పై నిదానపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మండల తహశీల్దార్ లాల్ బహుదూర్, ఆర్‌ఐ శోభ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా SIR ప్రక్రియ ప్రాధాన్యతను గ్రామస్తులకు వివరించారు. సెప్టెంబర్ 5 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించే ప్రత్యేక డ్రైవ్‌ను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఫారమ్-6 ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, ఓటరు కార్డులో తప్పులు లేదా చిరునామా మార్పులు ఉన్నవారు ఫారమ్-8 ద్వారా సవరణలు చేసుకోవాలని తెలిపారు.

సెప్టెంబర్ 5, 6 తేదీల్లో పోలింగ్ కేంద్రాల వద్ద BLOలు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుమన్, జీపీఓ లక్ష్మి, బి ఎల్‌ఓ బబ్బూరి నాగమణి, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

Sthanikam

ఓటరు జాబితా సవరణను సద్వినియోగం చేసుకోవాలి. తాసిల్దార్ లాల్ బహుదూర్

Article Image

నిదానపల్లిలో ఘనంగా SIR అవగాహన సదస్సు.

నిదానపల్లి, సెప్టెంబర్ 5: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR-2026)పై నిదానపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మండల తహశీల్దార్ లాల్ బహుదూర్, ఆర్‌ఐ శోభ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా SIR ప్రక్రియ ప్రాధాన్యతను గ్రామస్తులకు వివరించారు. సెప్టెంబర్ 5 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించే ప్రత్యేక డ్రైవ్‌ను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఫారమ్-6 ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, ఓటరు కార్డులో తప్పులు లేదా చిరునామా మార్పులు ఉన్నవారు ఫారమ్-8 ద్వారా సవరణలు చేసుకోవాలని తెలిపారు.

సెప్టెంబర్ 5, 6 తేదీల్లో పోలింగ్ కేంద్రాల వద్ద BLOలు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుమన్, జీపీఓ లక్ష్మి, బి ఎల్‌ఓ బబ్బూరి నాగమణి, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News