తిరుమలగిరి: దివ్యాంగులు, వృద్ధులు, మహిళలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దివ్యాంగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ హాజరై ప్రసంగించారు.
దివ్యాంగులకు రూ.6వేల పింఛన్, బ్యాక్లాగ్ పోస్టులు ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దివ్యాంగుల సంక్షేమానికి రూ.10,300 కోట్లు అందించిన ఘనత కేసీఆర్కు దక్కుతుందని పేర్కొన్నారు.
వృద్ధులు, మహిళలకు ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీల అమలు కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉద్యమాలు, పోరాటాలు కొనసాగిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్ రావు,నేవూరి ధర్మేందర్ రెడ్డి, తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి,పార్టీ నాయకులు కల్లేట్లపల్లి ఉప్పలయ్య,కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి,యాకోబ్ రెడ్డి,తాటికొండ సీతయ్య, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు,త్రిశూల్,రమేష్,నరేష్,యాకూబ్,శోభన్ బాబు సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీలు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి