Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జర్నలిస్టుల ఐక్యతకు మరో ముందడుగు.. నూతన యూనియన్ ఐడీ కార్డుల పంపిణీ భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 05, 2026 09:20 PM

ఆరోగ్యవంతమైన ప్రజలతోనే వికసిత్‌ భారత్‌. కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి.

ఆరోగ్యవంతమైన ప్రజలతోనే వికసిత్‌ భారత్‌. కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి.

ఆరోగ్యవంతమైన ప్రజలతోనే వికసిత్‌ భారత్‌. కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి.
05-09-2026 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌: ఆరోగ్యవంతమైన ప్రజలతోనే వికసిత్‌ భారత్‌ నిర్మాణం సాధ్యమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని సాధించాలంటే ఆరోగ్యం, పోషకాహారం, పరిశుభ్రత, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఏ.వి. కళాశాలలో సీబీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐదు రోజుల జాతీయ పోషణ మాసోత్సవం ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నిద్ర, వ్యాయామం, నడక, యోగా, క్రీడలను జీవన విధానంలో భాగం చేసుకోవాలని సూచించారు. నూనె, చక్కెర వినియోగాన్ని తగ్గించి జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలని, మొబైల్‌ వినియోగాన్ని పరిమితం చేయాలని కోరారు.

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్‌ నిర్మూలనకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ‘నషా ముక్త్‌ భారత్‌’, ‘ఫిట్‌ ఇండియా’ కార్యక్రమాలు దేశ భవిష్యత్తు కోసం చేపడుతున్నవేనని తెలిపారు. పీఐబీ, సీబీసీ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ శృతి పాటిల్‌ మాట్లాడుతూ.. ఐదు రోజుల కార్యక్రమంతో విద్యార్థుల్లో పోషకాహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, కళాశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు

Sthanikam

ఆరోగ్యవంతమైన ప్రజలతోనే వికసిత్‌ భారత్‌. కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి.

Article Image

హైదరాబాద్‌: ఆరోగ్యవంతమైన ప్రజలతోనే వికసిత్‌ భారత్‌ నిర్మాణం సాధ్యమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని సాధించాలంటే ఆరోగ్యం, పోషకాహారం, పరిశుభ్రత, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఏ.వి. కళాశాలలో సీబీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐదు రోజుల జాతీయ పోషణ మాసోత్సవం ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నిద్ర, వ్యాయామం, నడక, యోగా, క్రీడలను జీవన విధానంలో భాగం చేసుకోవాలని సూచించారు. నూనె, చక్కెర వినియోగాన్ని తగ్గించి జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలని, మొబైల్‌ వినియోగాన్ని పరిమితం చేయాలని కోరారు.

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్‌ నిర్మూలనకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ‘నషా ముక్త్‌ భారత్‌’, ‘ఫిట్‌ ఇండియా’ కార్యక్రమాలు దేశ భవిష్యత్తు కోసం చేపడుతున్నవేనని తెలిపారు. పీఐబీ, సీబీసీ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ శృతి పాటిల్‌ మాట్లాడుతూ.. ఐదు రోజుల కార్యక్రమంతో విద్యార్థుల్లో పోషకాహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, కళాశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News