Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జర్నలిస్టుల ఐక్యతకు మరో ముందడుగు.. నూతన యూనియన్ ఐడీ కార్డుల పంపిణీ భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 05, 2026 08:56 PM

గురువులే భావి తరానికి దిక్సూచి

గురువులే భావి తరానికి దిక్సూచి

గురువులే భావి తరానికి దిక్సూచి
05-09-2026 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

సౌమ్య విద్యామందిర్‌ ప్రిన్సిపల్‌ బొడిగె విజయకుమార్‌.


చిన్నకాపర్తి: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని సౌమ్య విద్యామందిర్‌ పాఠశాల ప్రిన్సిపల్‌ బొడిగె విజయకుమార్‌ అన్నారు. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని శనివారం చిన్నకాపర్తిలోని సౌమ్య విద్యామందిర్‌ పాఠశాలలో గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ.. విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా, విలువలు, క్రమశిక్షణ, నైతికత, సామాజిక బాధ్యత వంటి అంశాలను అలవర్చడంలో ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలవాలని సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, సరైన మార్గనిర్దేశం చేస్తే వారు ఉన్నత శిఖరాలను అధిరోహించేలా తీర్చిదిద్దవచ్చన్నారు. విద్యారంగానికి, ఉపాధ్యాయ వృత్తికి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అందించిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.అనంతరం పాఠశాల ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రుద్రారపు లావణ్య, మునుకుంట్ల వేణు, మునుకుంట్ల స్వాతి, గండమల్ల చర్విత, రేగులగడ్డ ప్రశాంతి, సురోజు హర్షిణి, విద్యార్థులు పాల్గొన్నారు.


Sthanikam

గురువులే భావి తరానికి దిక్సూచి

Article Image

సౌమ్య విద్యామందిర్‌ ప్రిన్సిపల్‌ బొడిగె విజయకుమార్‌.


చిన్నకాపర్తి: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని సౌమ్య విద్యామందిర్‌ పాఠశాల ప్రిన్సిపల్‌ బొడిగె విజయకుమార్‌ అన్నారు. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని శనివారం చిన్నకాపర్తిలోని సౌమ్య విద్యామందిర్‌ పాఠశాలలో గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ.. విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా, విలువలు, క్రమశిక్షణ, నైతికత, సామాజిక బాధ్యత వంటి అంశాలను అలవర్చడంలో ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలవాలని సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, సరైన మార్గనిర్దేశం చేస్తే వారు ఉన్నత శిఖరాలను అధిరోహించేలా తీర్చిదిద్దవచ్చన్నారు. విద్యారంగానికి, ఉపాధ్యాయ వృత్తికి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అందించిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.అనంతరం పాఠశాల ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రుద్రారపు లావణ్య, మునుకుంట్ల వేణు, మునుకుంట్ల స్వాతి, గండమల్ల చర్విత, రేగులగడ్డ ప్రశాంతి, సురోజు హర్షిణి, విద్యార్థులు పాల్గొన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News