Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గురువులే సమాజానికి జ్ఞానజ్యోతులు అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 06, 2026 06:58 AM

గుడిమల్కాపురంలో భక్తిశ్రద్ధలతో ఈదమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన

గుడిమల్కాపురంలో భక్తిశ్రద్ధలతో ఈదమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన

గుడిమల్కాపురంలో భక్తిశ్రద్ధలతో ఈదమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన
06-09-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ముఖ్య అతిథిగా హాజరైన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్

అమ్మవారికి ప్రత్యేక పూజలు, శ్రీనివాస్ గౌడ్‌కు ఘన సన్మానం

సంస్థాన్ నారాయణపూర్ మండల పరిధిలోని గుడిమల్కాపురం గ్రామంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ ఈదమ్మ దేవత విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక కోలాహలం మధ్య వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ (శీనన్న) ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఈదమ్మ తల్లి దివ్య ఆశీస్సులు గుడిమల్కాపురం గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో సుఖసంతోషాలు విలసిల్లాలని ఆకాంక్షించారు. గ్రామంలో భక్తిప్రపత్తులతో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లిందని, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామస్థులను ఆయన అభినందించారు.

​అతిథికి ఘన సన్మానం

ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు జాజుల శ్రీనివాస్ గౌడ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల భక్తులు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

గుడిమల్కాపురంలో భక్తిశ్రద్ధలతో ఈదమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన

Article Image

ముఖ్య అతిథిగా హాజరైన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్

అమ్మవారికి ప్రత్యేక పూజలు, శ్రీనివాస్ గౌడ్‌కు ఘన సన్మానం

సంస్థాన్ నారాయణపూర్ మండల పరిధిలోని గుడిమల్కాపురం గ్రామంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ ఈదమ్మ దేవత విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక కోలాహలం మధ్య వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ (శీనన్న) ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఈదమ్మ తల్లి దివ్య ఆశీస్సులు గుడిమల్కాపురం గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో సుఖసంతోషాలు విలసిల్లాలని ఆకాంక్షించారు. గ్రామంలో భక్తిప్రపత్తులతో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లిందని, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామస్థులను ఆయన అభినందించారు.

​అతిథికి ఘన సన్మానం

ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు జాజుల శ్రీనివాస్ గౌడ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల భక్తులు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News