పోలీస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి: సీఐ మన్మథకుమార్
అత్యవసర వేళల్లో 100 / 112కు సమాచారం ఇవ్వాలని వినతి
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు పోలీస్ శాఖ అనుమతులను ఆన్లైన్ విధానంలోనే పొందాలని చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఉత్సవ నిర్వాహకులు ముందుగా తెలంగాణ స్టేట్ పోలీస్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.దరఖాస్తులో మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, నిర్వాహకుల వివరాలు, పూర్తి సమాచారాన్ని నమోదు చేయాలి. అధికారులు పరిశీలించిన అనంతరం ఆన్లైన్ ద్వారానే QR/డిజిటల్ NOC జారీ చేస్తారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా మండపాలు నిర్మించాలి. విద్యుత్ భద్రత, అగ్నిప్రమాదాల నివారణ చర్యలు తప్పనిసరిగా చేపట్టాలి. శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటిస్తూ, ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవడానికి పోలీసులకు సహకరించాలి. ఎలాంటి సమస్యలు లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే 100 లేదా 112 సంఖ్యలకు సమాచారం అందించాలని సీఐ కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి