Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 09:54 AM

రామలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో శుభ్రత కార్యక్రమం

రామలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో శుభ్రత కార్యక్రమం

రామలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో శుభ్రత కార్యక్రమం
08-09-2026 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

కాలనీ అభివృద్ధికి యువత ముందడుగు.. మార్పు సాధ్యమేనని నిరూపించారు

స్థానిక యువకులు, భక్తులు కలిసి ఆలయ పరిసరాలను శుభ్రం చేసి.. గ్రామంలో స్వచ్ఛతకు ఆదర్శంగా నిలిచారు

వినాయక చవితి సందర్భంగా న్యాల్కల్ మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మహాదేవ్ యూత్ సభ్యులు శుభ్రత కార్యక్రమం చేపట్టారు. తమ సొంత ఖర్చులతో ఆలయ పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు ప్రజల సౌకర్యం కోసం అవసరమైన పనులను చేపట్టారు.ఆలయ పరిసరాల్లో పిచ్చి మొక్కలు, గడ్డి, చెత్తాచెదారం పెరిగి ఉండటంతో భక్తులకు కొంత అసౌకర్యంగా ఉండేది. ఈ విషయాన్ని గుర్తించిన మహాదేవ్ యూత్ సభ్యులు ముందుకు వచ్చి పిచ్చి మొక్కలు, గడ్డిని తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు.అదేవిధంగా కాలనీలోని హ్యాండ్‌బోర్‌కు వెళ్లే మార్గంలో ఉన్న మోరిపై గతంలో ఏర్పాటు చేసిన చిన్న సిమెంట్ బండ దెబ్బతిని ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉండేది. దీంతో మహాదేవ్ యూత్ సభ్యులు సొంత ఖర్చులతో మోరిపై పటిష్టమైన సిమెంట్ కవరింగ్ ఏర్పాటు చేశారు.వినాయక చవితి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణం కల్పించడంతో పాటు ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని యువత చేపట్టిన ఈ సేవా కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు.యువత సామాజిక బాధ్యతతో ముందుకు వస్తే గ్రామం, కాలనీ అభివృద్ధిలో మంచి మార్పు సాధ్యమవుతుందని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.

Sthanikam

రామలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో శుభ్రత కార్యక్రమం

Article Image

కాలనీ అభివృద్ధికి యువత ముందడుగు.. మార్పు సాధ్యమేనని నిరూపించారు

స్థానిక యువకులు, భక్తులు కలిసి ఆలయ పరిసరాలను శుభ్రం చేసి.. గ్రామంలో స్వచ్ఛతకు ఆదర్శంగా నిలిచారు

వినాయక చవితి సందర్భంగా న్యాల్కల్ మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మహాదేవ్ యూత్ సభ్యులు శుభ్రత కార్యక్రమం చేపట్టారు. తమ సొంత ఖర్చులతో ఆలయ పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు ప్రజల సౌకర్యం కోసం అవసరమైన పనులను చేపట్టారు.ఆలయ పరిసరాల్లో పిచ్చి మొక్కలు, గడ్డి, చెత్తాచెదారం పెరిగి ఉండటంతో భక్తులకు కొంత అసౌకర్యంగా ఉండేది. ఈ విషయాన్ని గుర్తించిన మహాదేవ్ యూత్ సభ్యులు ముందుకు వచ్చి పిచ్చి మొక్కలు, గడ్డిని తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు.అదేవిధంగా కాలనీలోని హ్యాండ్‌బోర్‌కు వెళ్లే మార్గంలో ఉన్న మోరిపై గతంలో ఏర్పాటు చేసిన చిన్న సిమెంట్ బండ దెబ్బతిని ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉండేది. దీంతో మహాదేవ్ యూత్ సభ్యులు సొంత ఖర్చులతో మోరిపై పటిష్టమైన సిమెంట్ కవరింగ్ ఏర్పాటు చేశారు.వినాయక చవితి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణం కల్పించడంతో పాటు ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని యువత చేపట్టిన ఈ సేవా కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు.యువత సామాజిక బాధ్యతతో ముందుకు వస్తే గ్రామం, కాలనీ అభివృద్ధిలో మంచి మార్పు సాధ్యమవుతుందని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News