Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 09:51 AM

పిటపల్లిలో ప్రాణాల మీదకు వచ్చిన విద్యుత్‌ తీగలు

పిటపల్లిలో ప్రాణాల మీదకు వచ్చిన విద్యుత్‌ తీగలు

పిటపల్లిలో ప్రాణాల మీదకు వచ్చిన విద్యుత్‌ తీగలు
08-09-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


గాలికి ఒకదానికొకటి తగులుతూ నిప్పులు.. పట్టించుకోని సిబ్బందిపై గ్రామస్తుల ఆగ్రహం.


నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిటపల్లి గ్రామంలో మెయిన్‌ విద్యుత్‌ లైన్లు ప్రమాదకరంగా మారాయి. గాలివానలకు విద్యుత్‌ వైర్లు ఒకదానికొకటి తగులుతూ మంటలు, నిప్పురవ్వలు ఎగసిపడుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయాందోళన చెందుతున్నారు.

సమస్యను పలుమార్లు సంబంధిత లైన్‌మన్‌ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పగా.. ‘చెప్పుకోండి’ అన్నట్లుగా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని వారు వాపోతున్నారు. దీంతో విద్యుత్‌ శాఖ సిబ్బంది తీరుపై గ్రామస్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఇదిలా ఉండగా.. ప్రమాదకరంగా మారిన మెయిన్‌ విద్యుత్‌ లైన్ల కిందనే చిన్నారులు ప్రతిరోజూ ఆడుకుంటున్నారు. తీగలు తెగిపడినా, షార్ట్‌సర్క్యూట్‌ జరిగినా ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ప్రమాదం జరిగే వరకు అధికారులు వేచిచూడకుండా వెంటనే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. విద్యుత్‌ వైర్లను పరిశీలించి సరిచేయడంతోపాటు, అవసరమైన భద్రతా చర్యలు చేపట్టి చిన్నారులు, గ్రామస్తుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని విద్యుత్‌ శాఖ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.


Sthanikam

పిటపల్లిలో ప్రాణాల మీదకు వచ్చిన విద్యుత్‌ తీగలు

Article Image


గాలికి ఒకదానికొకటి తగులుతూ నిప్పులు.. పట్టించుకోని సిబ్బందిపై గ్రామస్తుల ఆగ్రహం.


నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిటపల్లి గ్రామంలో మెయిన్‌ విద్యుత్‌ లైన్లు ప్రమాదకరంగా మారాయి. గాలివానలకు విద్యుత్‌ వైర్లు ఒకదానికొకటి తగులుతూ మంటలు, నిప్పురవ్వలు ఎగసిపడుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయాందోళన చెందుతున్నారు.

సమస్యను పలుమార్లు సంబంధిత లైన్‌మన్‌ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పగా.. ‘చెప్పుకోండి’ అన్నట్లుగా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని వారు వాపోతున్నారు. దీంతో విద్యుత్‌ శాఖ సిబ్బంది తీరుపై గ్రామస్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఇదిలా ఉండగా.. ప్రమాదకరంగా మారిన మెయిన్‌ విద్యుత్‌ లైన్ల కిందనే చిన్నారులు ప్రతిరోజూ ఆడుకుంటున్నారు. తీగలు తెగిపడినా, షార్ట్‌సర్క్యూట్‌ జరిగినా ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ప్రమాదం జరిగే వరకు అధికారులు వేచిచూడకుండా వెంటనే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. విద్యుత్‌ వైర్లను పరిశీలించి సరిచేయడంతోపాటు, అవసరమైన భద్రతా చర్యలు చేపట్టి చిన్నారులు, గ్రామస్తుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని విద్యుత్‌ శాఖ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News