Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
22 రోస్టర్ పాయింట్లకు చట్టబద్ధ రక్షణ కల్పించాలి ఎస్సీ వర్గీకరణను యథాతథంగా కొనసాగించాలని నల్గొండలో మాల మహానాడు భారీ నిరసన కోతలేని ‘పోయం’ చికిత్సతో అకాలేషియా బాధితులకు కొత్త ఆశ నల్గొండ మహిళకు యశోదా ఆస్పత్రిలో విజయవంతమైన చికిత్స లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 22, 2026 09:39 PM

ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి ; మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి

ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి ; మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి

ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి ;  మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి
July 22, 2026 08:22 PM 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తిరుమలగిరి;భూగర్భ జలాలను పరిరక్షించడంలో భవిష్యత్తులో నీటి ఎద్దడిని నివారించడంలో ఇంకుడు గుంతలు ఎంతగానో తోడ్పడతాయనీ మున్సిపల్ చైర్మన్ రఘునందన్ రెడ్డి అన్నారు. పట్టణ మున్సిపాలిటీ 3, 14వ వార్డులలో ఇంకుడు గుంతలను మున్సిపల్ కమిషనర్ వెంకన్నతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. అనంతరం ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు.

వర్షాకాలంలో వృథాగా పోయే ప్రతి చుక్క నీటిని భూమిలోకి ఇంకింపజేయడానికి ఇవి అత్యంత సరైన మార్గమని వర్షపు నీరు రోడ్లపాలై వృథా కాకుండా,ఇంకుడు గుంతల ద్వారా నేరుగా భూమిలోకి చేరుతుంది అని అన్నారు. దీనివల్ల బోర్లు, బావులలో నీటి మట్టం గణనీయంగా పెరుగుతుంది అని అన్నారు.వేసవి కాలంలో నీటి కొరత ఏర్పడకుండా భూగర్భ జలాలు నిరంతరం అందుబాటులో ఉండేలా సహాయపడతాయనీ

ఇంటి చుట్టూ లేదా వీధుల్లో వాన నీరు నిలిచిపోయి బురదమయం కాకుండా,దోమల బెడద మరియు వ్యాధులు ప్రబలకుండా నివారిస్తుందనీ అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకన్న ,డిప్యూటీ తహసీల్దార్ జాన్ మొహమ్మద్ , కౌన్సిలర్లు సోమలక్ష్మీ నరేష్,గీతా బాబు,BRS నాయకులు సందీప్ నేత, ఏనుగుల నాగన్న,విఘ్నేష్, యాదగిరి,రవి,నరేష్, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది అఖిల,లక్ష్మణ్ ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News