ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి ; మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి
ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి ; మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి
Bandi Kiran Kumar
తిరుమలగిరి;భూగర్భ జలాలను పరిరక్షించడంలో భవిష్యత్తులో నీటి ఎద్దడిని నివారించడంలో ఇంకుడు గుంతలు ఎంతగానో తోడ్పడతాయనీ మున్సిపల్ చైర్మన్ రఘునందన్ రెడ్డి అన్నారు. పట్టణ మున్సిపాలిటీ 3, 14వ వార్డులలో ఇంకుడు గుంతలను మున్సిపల్ కమిషనర్ వెంకన్నతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. అనంతరం ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు.
వర్షాకాలంలో వృథాగా పోయే ప్రతి చుక్క నీటిని భూమిలోకి ఇంకింపజేయడానికి ఇవి అత్యంత సరైన మార్గమని వర్షపు నీరు రోడ్లపాలై వృథా కాకుండా,ఇంకుడు గుంతల ద్వారా నేరుగా భూమిలోకి చేరుతుంది అని అన్నారు. దీనివల్ల బోర్లు, బావులలో నీటి మట్టం గణనీయంగా పెరుగుతుంది అని అన్నారు.వేసవి కాలంలో నీటి కొరత ఏర్పడకుండా భూగర్భ జలాలు నిరంతరం అందుబాటులో ఉండేలా సహాయపడతాయనీ
ఇంటి చుట్టూ లేదా వీధుల్లో వాన నీరు నిలిచిపోయి బురదమయం కాకుండా,దోమల బెడద మరియు వ్యాధులు ప్రబలకుండా నివారిస్తుందనీ అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకన్న ,డిప్యూటీ తహసీల్దార్ జాన్ మొహమ్మద్ , కౌన్సిలర్లు సోమలక్ష్మీ నరేష్,గీతా బాబు,BRS నాయకులు సందీప్ నేత, ఏనుగుల నాగన్న,విఘ్నేష్, యాదగిరి,రవి,నరేష్, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది అఖిల,లక్ష్మణ్ ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి