Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
22 రోస్టర్ పాయింట్లకు చట్టబద్ధ రక్షణ కల్పించాలి ఎస్సీ వర్గీకరణను యథాతథంగా కొనసాగించాలని నల్గొండలో మాల మహానాడు భారీ నిరసన కోతలేని ‘పోయం’ చికిత్సతో అకాలేషియా బాధితులకు కొత్త ఆశ నల్గొండ మహిళకు యశోదా ఆస్పత్రిలో విజయవంతమైన చికిత్స లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 22, 2026 09:42 PM

రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి ;ఎమ్మెల్యే సామెల్

రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి ;ఎమ్మెల్యే సామెల్

రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి ;ఎమ్మెల్యే సామెల్
July 22, 2026 08:22 PM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి;ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో వరి సాగుకంటే ప్రత్యామ్నాయ పంటలే మేలని తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్ అన్నారు.మండల పరిషత్ లో మాట్లాడుతూ...

ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు, భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయన్నారు . బోర్లలో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. అలాగే చెరువులుపూర్తిస్థాయిలో నిండే పరిస్థితి కనిపించడం లేదని, చివరి దశలో వర్షాలు వచ్చినా కూడా చెరువులు పూర్తిగా నిండే అవకాశం తక్కువగా ఉందన్నారు.

అందువల్ల రైతులు మొత్తం విస్తీర్ణంలో వరి సాగు చేయకుండా, కొంత భాగంలో ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు .

తక్కువ నీటితో సాగు చేయగల పంటలు:

జొన్న,పెసలు,మినుములు,కంది,పొద్దుతిరుగుడు,ఆముదం లాంటి పంటలు సాగు చేయటం ఉత్తమం అన్నారు.రాబోయే రోజుల్లో బోర్లు, చెరువుల ద్వారా నీటి లభ్యత మరింత తగ్గే అవకాశం ఉన్నందున, నీటిని ఆదా చేస్తూ ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసి నష్టాలను తగ్గించుకోవాలన్నారు.

రైతులందరూ పరిస్థితు లను దృష్టిలోఉంచుకుని వరి సాగును కొంత మేర తగ్గించి, ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, గ్రామ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News