రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి ;ఎమ్మెల్యే సామెల్
రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి ;ఎమ్మెల్యే సామెల్
Bandi Kiran Kumar
తుంగతుర్తి;ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో వరి సాగుకంటే ప్రత్యామ్నాయ పంటలే మేలని తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్ అన్నారు.మండల పరిషత్ లో మాట్లాడుతూ...
ప్రస్తుతం ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు, భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయన్నారు . బోర్లలో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. అలాగే చెరువులుపూర్తిస్థాయిలో నిండే పరిస్థితి కనిపించడం లేదని, చివరి దశలో వర్షాలు వచ్చినా కూడా చెరువులు పూర్తిగా నిండే అవకాశం తక్కువగా ఉందన్నారు.
అందువల్ల రైతులు మొత్తం విస్తీర్ణంలో వరి సాగు చేయకుండా, కొంత భాగంలో ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు .
తక్కువ నీటితో సాగు చేయగల పంటలు:
జొన్న,పెసలు,మినుములు,కంది,పొద్దుతిరుగుడు,ఆముదం లాంటి పంటలు సాగు చేయటం ఉత్తమం అన్నారు.రాబోయే రోజుల్లో బోర్లు, చెరువుల ద్వారా నీటి లభ్యత మరింత తగ్గే అవకాశం ఉన్నందున, నీటిని ఆదా చేస్తూ ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసి నష్టాలను తగ్గించుకోవాలన్నారు.
రైతులందరూ పరిస్థితు లను దృష్టిలోఉంచుకుని వరి సాగును కొంత మేర తగ్గించి, ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, గ్రామ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి