అత్యంత యువజన వ్యతిరేక ప్రధాని మోదీ: పెద్దగోని మౌనిక గౌడ్
అత్యంత యువజన వ్యతిరేక ప్రధాని మోదీ: పెద్దగోని మౌనిక గౌడ్
K.RAVI
నీట్ ఆందోళనకారులపై బలప్రయోగం రాజ్యాంగ విరుద్ధం
ప్రధాని నరేంద్ర మోదీ దేశ చరిత్రలోనే అత్యంత యువజన వ్యతిరేక ప్రధానమంత్రిగా మిగిలిపోతారని తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దగోని మౌనిక గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై సీజేపీ చేపట్టిన 'చలో పార్లమెంట్' నిరసనలో విద్యార్థులపై పోలీసులు భాష్పవాయు గోళాలు ప్రయోగించి, లాఠీచార్జ్ చేయడాన్ని ఆమె తీవ్రంగా నిరసించారు. ఈ సందర్భంగా మౌనిక గౌడ్ మాట్లాడుతూ.. హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులను అణచివేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. పార్లమెంట్ ఎవరి వ్యక్తిగత సొత్తు కాదని, దేశ భవిష్యత్తయిన యువతదని పేర్కొన్నారు. వెంటనే విద్యార్థులపై బలప్రయోగాన్ని నిలిపివేసి, నీట్ పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి