Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ భారీ ధర్నా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 22, 2026 05:17 PM

అత్యంత యువజన వ్యతిరేక ప్రధాని మోదీ: పెద్దగోని మౌనిక గౌడ్

అత్యంత యువజన వ్యతిరేక ప్రధాని మోదీ: పెద్దగోని మౌనిక గౌడ్

అత్యంత యువజన వ్యతిరేక ప్రధాని మోదీ: పెద్దగోని మౌనిక గౌడ్
July 22, 2026 03:53 PM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నీట్ ఆందోళనకారులపై బలప్రయోగం రాజ్యాంగ విరుద్ధం

ప్రధాని నరేంద్ర మోదీ దేశ చరిత్రలోనే అత్యంత యువజన వ్యతిరేక ప్రధానమంత్రిగా మిగిలిపోతారని తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దగోని మౌనిక గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై సీజేపీ చేపట్టిన 'చలో పార్లమెంట్' నిరసనలో విద్యార్థులపై పోలీసులు భాష్పవాయు గోళాలు ప్రయోగించి, లాఠీచార్జ్ చేయడాన్ని ఆమె తీవ్రంగా నిరసించారు. ​ఈ సందర్భంగా మౌనిక గౌడ్ మాట్లాడుతూ.. హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులను అణచివేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. పార్లమెంట్ ఎవరి వ్యక్తిగత సొత్తు కాదని, దేశ భవిష్యత్తయిన యువతదని పేర్కొన్నారు. వెంటనే విద్యార్థులపై బలప్రయోగాన్ని నిలిపివేసి, నీట్ పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News