సంగాపూర్ చోరీ కేసులో పోలీసుల సక్సెస్.. 24 గంటల్లోనే నిందితుడి అరెస్ట్
సంగాపూర్ చోరీ కేసులో పోలీసుల సక్సెస్.. 24 గంటల్లోనే నిందితుడి అరెస్ట్
Krishna
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగాపూర్ గ్రామంలో జరిగిన చోరీ కేసును రాయికోడ్ పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. కాలిమొల్ల నాగేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇంటి తాళం పగులగొట్టి సుమారు 20 తులాల వెండి పట్టీలు, శాంసంగ్ మొబైల్ ఫోన్ను అపహరించిన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి శాస్త్రీయ ఆధారాలు, సాంకేతిక సమాచారం, ఇతర సాక్ష్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సంగాపూర్ గ్రామానికి చెందిన మడిగడ్డ బసవరాజ్ చోరీకి పాల్పడినట్లు గుర్తించి 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు.అనంతరం నిందితుడిని న్యాయస్థానం ముందు హాజరుపరచగా కోర్టు జ్యుడీషియల్ రిమాండ్కు పంపింది. ఈ సందర్భంగా రాయికోడ్ ఎస్సై చైతన్య కిరణ్ మాట్లాడుతూ, నేరాల నియంత్రణలో ప్రజల సహకారం ఎంతో కీలకమని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి