బాధితులకు ‘సీఎంఆర్ఎఫ్’ కొండంత అండ
బాధితులకు ‘సీఎంఆర్ఎఫ్’ కొండంత అండ
K.RAVI
దండు మల్కాపూర్లో సహాయ నిధి చెక్కుల పంపిణీ
అత్యవసర వైద్య చికిత్సలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కొండంత అండగా నిలుస్తోందని కాంగ్రెస్ పార్టీ దండు మల్కాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు, వార్డు మెంబర్ సుక్క రవీందర్ తెలిపారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సిఫారసుతో గ్రామానికి చెందిన పలువురు బాధితులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను బుధవారం గ్రామ నాయకుల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేశారు.
గ్రామానికి చెందిన బోయిని స్వరూప 56,000, జొన్నగంటి జంగయ్య 45,000, పేరుమాండ్ల అచ్చమ్మ 35,000, బుర్ర దేవి 17,000 చొప్పున ఆర్థిక సాయం చెక్కులను అందజేసినట్లు నాయకులు తెలిపారు. ఆపద సమయంలో సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు చేయించి ఆదుకున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి లబ్ధిదారులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మీసాల నర్సింహ, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ దేప శ్యాంసుందర్ ముదిరాజ్, ఏఎంసీ డైరెక్టర్ మహమ్మద్ గౌస్ ఖాన్, వార్డు మెంబర్లు ఈడ్దుల ఇంద్రసేన యాదవ్, అత్తపురం సంతోష అంజిరెడ్డి, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు మునుకుంట్ల రాజు గౌడ్, దేవాలయ ధర్మకర్తలు ఈడ్దుల బాబు యాదవ్, దౌడి లింగస్వామి, పార్టీ నాయకులు పీసరి యాదిరెడ్డి, మల్కాజ్గిరి నరసింహ, దౌడి వెంకటేష్, ఈడ్దుల కేశవ్ యాదవ్, బద్దుల నర్సింహ, ముదిగొండ మహేష్, బుర్ర శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి