Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పీఎం విశ్వకర్మ యోజనతో చేతివృత్తిదారులకు అండగా కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 22, 2026 06:32 PM

దాశరధి ఆశయ స్ఫూర్తితో ముందుకు సాగాలి ; తాటికొండ సీతయ్య

దాశరధి ఆశయ స్ఫూర్తితో ముందుకు సాగాలి ; తాటికొండ సీతయ్య

దాశరధి ఆశయ స్ఫూర్తితో ముందుకు సాగాలి ; తాటికొండ సీతయ్య
July 22, 2026 04:53 PM 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి;మహాకవి దాశరధి కృష్ణమాచార్య ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ, ఆయన చూపిన మార్గంలో నడవాలని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య (మాజీ ఎంపీపీ) పిలుపునిచ్చారు. మహాకవి దాశరధి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా తుంగతుర్తి మండల పార్టీ కార్యాలయంలో బుధవారం ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాశరధి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా తాటికొండ సీతయ్య మాట్లాడుతూ, "నా తెలంగాణ కోటి రత్నాల వీణ" అంటూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహాకవి దాశరధి కృష్ణమాచార్య అన్నారు తెలంగాణ సాయుధ పోరాట యోధుడిగా, ప్రజాకవిగా చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఆయన సాహిత్యం, భావజాలం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, మండల నాయకులు గోపగాని రమేష్, నల్లబెల్లి వెంకటేష్, బొంకూరి మల్లేష్, సాయికుమార్, సురేష్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News