పీఎం విశ్వకర్మ యోజనతో చేతివృత్తిదారులకు అండగా కేంద్ర ప్రభుత్వం
పీఎం విశ్వకర్మ యోజనతో చేతివృత్తిదారులకు అండగా కేంద్ర ప్రభుత్వం
Krishna
నారాయణఖేడ్ పట్టణంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద అర్హులైన లబ్ధిదారులకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు జి. రాజశేఖర్ గౌడ్, కంగ్టి మండల ప్రభారి పట్నం మాణిక్ మాట్లాడుతూ, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులు, చిన్న వృత్తిదారులను ఆర్థికంగా బలోపేతం చేసి స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.13 వేల కోట్లతో పీఎం విశ్వకర్మ యోజనను అమలు చేస్తోందన్నారు. ఈ పథకం ద్వారా అర్హులకు గుర్తింపు కార్డు, నైపుణ్య శిక్షణ, ఆధునిక పనిముట్లు, మొదటి విడతగా రూ.1 లక్ష, రెండో విడతగా రూ.2 లక్షల వరకు కేవలం 5 శాతం వడ్డీతో రుణ సౌకర్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం చేతివృత్తుల అభివృద్ధికి, వెనుకబడిన వర్గాల ఆర్థిక పురోగతికి ఎంతో ఉపయోగపడుతుందని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇటువంటి సంక్షేమ పథకాలతో దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు సాయందర్, వెంకట్ రెడ్డి, లోకేష్, సగనాకర్, సాయి పటేల్, నాగనాథ్, మేకల జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి