సీతారాంపురం వద్ద తృటిలో తప్పిన పెను ప్రమాదం
సీతారాంపురం వద్ద తృటిలో తప్పిన పెను ప్రమాదం
Komidala Mahender reddy
పల్లె వెలుగు బస్సును వెనుక నుంచి ఢీకొన్న సిమెంట్ లారీ.. పలువురికి స్వల్ప గాయాలు.
కోదాడ, జూలై 22:
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం సీతారాంపురం స్టేజి సమీపంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. మిర్యాలగూడ నుంచి కోదాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సును వెనుక నుంచి ఓ సిమెంట్ లారీ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం, వేగంగా వస్తున్న సిమెంట్ లారీ అదుపుతప్పి బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు, లారీ రెండూ రోడ్డుపక్కకు దూసుకెళ్లాయి. దీంతో కొంతసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలు కాగా, స్థానికులు వెంటనే స్పందించి బాధితులకు సహాయం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
ప్రమాదం తీవ్రంగా ఉన్నప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. తృటిలో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి