PRINT TIME: July 22, 2026 06:34 PM
మంజుల కుటుంబానికి సర్పంచ్ సాయికుమార్ గౌడ్ రూ.5 వేల ఆర్థిక సాయం.
మంజుల కుటుంబానికి సర్పంచ్ సాయికుమార్ గౌడ్ రూ.5 వేల ఆర్థిక సాయం.
July 22, 2026 03:41 PM
28 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన మేడి మంజుల ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆమె భర్త మేడి శ్రీరాములు (డ్రైవర్)తో పాటు కుటుంబ సభ్యులను గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ పరామర్శించారు.
ఈ సందర్భంగా మంజుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన సర్పంచ్, వెంటనే స్పందించి రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబానికి భవిష్యత్తులో ఎలాంటి అవసరం వచ్చినా తమ వంతు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బైకాని ఉమామహేష్ యాదవ్, 5వ వార్డు సభ్యురాలు నేరటి మానస సురేష్ యాదవ్, 6వ వార్డు సభ్యురాలు కడారి పావని పాపయ్య, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి