రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా నారాయణఖేడ్లో కాంగ్రెస్ భారీ ధర్నా
రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా నారాయణఖేడ్లో కాంగ్రెస్ భారీ ధర్నా
Krishna
ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి,జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ ఆదేశాల మేరకు నారాయణఖేడ్ పట్టణంలోని ఇంద్రచౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేలా ప్రతిపక్ష నాయకులపై అక్రమ అరెస్టులు చేయడం తగదని, ప్రజల గొంతుకను అణచివేసే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ సహించదని అన్నారు. అలాగే నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటు విద్యార్థుల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి