Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
SIR ఓటరు నమోదులో వేగం పెంచాలి.. కాంగ్రెస్ SIR ఇంచార్జి నల్ల బుచ్చన్న నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 13, 2026 07:58 PM

అంకిరెడ్డిగూడెం సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలి!

అంకిరెడ్డిగూడెం సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలి!

అంకిరెడ్డిగూడెం సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలి!
July 13, 2026 06:51 PM 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రజావాణిలో కలెక్టర్‌కు వార్డు సభ్యుల ఫిర్యాదు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ మల్లేష్ గౌడ్ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018ని ఉల్లంఘిస్తూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ఆరోపించారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి (గ్రీవెన్స్ డే) కార్యక్రమంలో వారు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.​సి.ఎస్.ఆర్ నిధుల వినియోగంలో అక్రమాలు గ్రామంలో దివీస్ పరిశ్రమకు సంబంధించిన రూ. 98 లక్షల సీఎస్ఆర్ నిధుల వ్యయంతో జరుగుతున్న సీసీ రోడ్డు పనుల్లో సర్పంచ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వార్డు సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా ఆస్తులను కాపాడాల్సిన సర్పంచే స్వయంగా తన అనుచరులకు మద్దతు పలుకుతూ.. గ్రామ పంచాయతీ భూములను, రోడ్లను ఆక్రమించుకునేలా ప్రత్యక్షంగా ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రోడ్డుపై అక్రమంగా నాటిన కడీలను వెంటనే తొలగించాలి. సర్పంచ్ అక్రమాల వల్ల నిలిచిపోయిన గ్రామ సీసీ రోడ్డు పనులను పునఃప్రారంభించి, త్వరితగతిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలి. ​పలు అక్రమాలకు పాల్పడుతున్న అంకిరెడ్డిగూడెం సర్పంచ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ వలందాసు మహేష్, వార్డు సభ్యులు బత్తుల అనూష, పాలెం వెంకటేష్, ముద్దం లింగస్వామి, దొడ్ల అండాలు, దండుగుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News