Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించడమే లక్ష్యం.. నేర నియంత్రణపై డీఐజీ జోయెల్ డేవిస్ దిశానిర్దేశం నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 13, 2026 09:06 PM

చిన్నారుల ఆరోగ్యానికి ఆల్బెండజోల్ రక్ష నాగార్జున స్కూల్‌లో నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ

చిన్నారుల ఆరోగ్యానికి ఆల్బెండజోల్ రక్ష నాగార్జున స్కూల్‌లో నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ

చిన్నారుల ఆరోగ్యానికి ఆల్బెండజోల్ రక్ష నాగార్జున స్కూల్‌లో నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ
July 13, 2026 07:42 PM 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, జూలై 13 నులిపురుగుల బారినుంచి కాపాడి ఆరోగ్యవంతమైన భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో రామన్నపేట మండల కేంద్రంలోని నాగార్జున స్కూల్‌లో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రేఖ నకిరేకంటి మాట్లాడుతూ.. చిన్నారుల్లో నులిపురుగులు కడుపులో చేరడం వల్ల రక్తహీనత, పోషకాహార లోపం, నీరసం, ఆకలి తగ్గడం, కడుపునొప్పి, వికారం, వాంతులు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. ఏడాదికి ఒకసారి ఆల్బెండజోల్ మాత్ర తీసుకోవడం ద్వారా నులిపురుగుల సమస్యను సమర్థవంతంగా నివారించవచ్చన్నారు.

పిల్లలు భోజనం చేసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పరిశుభ్రమైన తాగునీటినే వినియోగించడం, పూర్తిగా ఉడికిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం వంటి అలవాట్లు పెంపొందించుకోవాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్త శోభ, పాఠశాల సిబ్బంది సాయి ప్రసన్న, నాసియా తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News