Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:34 AM

చిన్నారుల ఆరోగ్యానికి రక్షణ కవచం.. ఆరెగూడెంలో నూలి పురుగుల నివారణ మాత్రల పంపిణీ

చిన్నారుల ఆరోగ్యానికి రక్షణ కవచం.. ఆరెగూడెంలో నూలి పురుగుల నివారణ మాత్రల పంపిణీ

చిన్నారుల ఆరోగ్యానికి రక్షణ కవచం.. ఆరెగూడెంలో నూలి పురుగుల నివారణ మాత్రల పంపిణీ
13-07-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: మండలంలోని ఆరెగూడెం గ్రామంలో జాతీయ నూలి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు నూలి పురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేశారు. గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అర్హులైన పిల్లలకు మాత్రలు అందజేసి వాటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ, చిన్నారుల్లో నూలి పురుగుల సమస్య వల్ల పోషకాహార లోపం, రక్తహీనత, ఎదుగుదల మందగించడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. పిల్లల సంపూర్ణ ఆరోగ్యాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న నూలి పురుగుల నివారణ కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అర్హత కలిగిన ప్రతి చిన్నారికి తప్పనిసరిగా నూలి పురుగుల నివారణ మాత్రలు వేయించాలని తల్లిదండ్రులను కోరారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్, గ్రామ కార్యదర్శి శారద, ఏఎన్ఎం, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


Sthanikam

చిన్నారుల ఆరోగ్యానికి రక్షణ కవచం.. ఆరెగూడెంలో నూలి పురుగుల నివారణ మాత్రల పంపిణీ

Article Image

చిట్యాల: మండలంలోని ఆరెగూడెం గ్రామంలో జాతీయ నూలి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు నూలి పురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేశారు. గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అర్హులైన పిల్లలకు మాత్రలు అందజేసి వాటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ, చిన్నారుల్లో నూలి పురుగుల సమస్య వల్ల పోషకాహార లోపం, రక్తహీనత, ఎదుగుదల మందగించడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. పిల్లల సంపూర్ణ ఆరోగ్యాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న నూలి పురుగుల నివారణ కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అర్హత కలిగిన ప్రతి చిన్నారికి తప్పనిసరిగా నూలి పురుగుల నివారణ మాత్రలు వేయించాలని తల్లిదండ్రులను కోరారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్, గ్రామ కార్యదర్శి శారద, ఏఎన్ఎం, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News