చిన్నారుల ఆరోగ్యానికి రక్షణ కవచం.. ఆరెగూడెంలో నూలి పురుగుల నివారణ మాత్రల పంపిణీ
చిన్నారుల ఆరోగ్యానికి రక్షణ కవచం.. ఆరెగూడెంలో నూలి పురుగుల నివారణ మాత్రల పంపిణీ
Komidala Mahender reddy
చిట్యాల: మండలంలోని ఆరెగూడెం గ్రామంలో జాతీయ నూలి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు నూలి పురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేశారు. గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అర్హులైన పిల్లలకు మాత్రలు అందజేసి వాటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ, చిన్నారుల్లో నూలి పురుగుల సమస్య వల్ల పోషకాహార లోపం, రక్తహీనత, ఎదుగుదల మందగించడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. పిల్లల సంపూర్ణ ఆరోగ్యాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న నూలి పురుగుల నివారణ కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అర్హత కలిగిన ప్రతి చిన్నారికి తప్పనిసరిగా నూలి పురుగుల నివారణ మాత్రలు వేయించాలని తల్లిదండ్రులను కోరారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్, గ్రామ కార్యదర్శి శారద, ఏఎన్ఎం, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి