Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:34 AM

పెట్టుబడుల పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తతే రక్షణ: కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి

పెట్టుబడుల పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తతే రక్షణ: కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి

పెట్టుబడుల పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తతే రక్షణ: కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి
14-07-2026 93 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

పెట్టుబడుల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కంగ్టి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకట్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం కంగ్టి సీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, "మీ డబ్బులు డబుల్ అవుతాయి", "100% సురక్షిత పెట్టుబడి", "కేంద్ర ప్రభుత్వ గ్యారెంటీ" వంటి ఆకర్షణీయమైన ప్రకటనలను నమ్మి ఎలాంటి ధృవీకరణ లేకుండా డబ్బులు పెట్టుబడి పెట్టవద్దని సూచించారు. పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత సంస్థకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేదా అనేది తప్పనిసరిగా పరిశీలించాలని, అధిక లాభాలు వస్తాయని చెప్పే పథకాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అలాగే అనుమానాస్పద లింకులు, సోషల్ మీడియా పోస్టులు, ఫోన్ కాల్స్‌ను నమ్మవద్దని, బ్యాంకు ఖాతా వివరాలు, OTPలు, UPI PIN వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ తెలియజేయకూడదని సూచించారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 జాతీయ సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సీఐ వెంకట్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

పెట్టుబడుల పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తతే రక్షణ: కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి

Article Image

పెట్టుబడుల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కంగ్టి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకట్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం కంగ్టి సీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, "మీ డబ్బులు డబుల్ అవుతాయి", "100% సురక్షిత పెట్టుబడి", "కేంద్ర ప్రభుత్వ గ్యారెంటీ" వంటి ఆకర్షణీయమైన ప్రకటనలను నమ్మి ఎలాంటి ధృవీకరణ లేకుండా డబ్బులు పెట్టుబడి పెట్టవద్దని సూచించారు. పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత సంస్థకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేదా అనేది తప్పనిసరిగా పరిశీలించాలని, అధిక లాభాలు వస్తాయని చెప్పే పథకాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అలాగే అనుమానాస్పద లింకులు, సోషల్ మీడియా పోస్టులు, ఫోన్ కాల్స్‌ను నమ్మవద్దని, బ్యాంకు ఖాతా వివరాలు, OTPలు, UPI PIN వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ తెలియజేయకూడదని సూచించారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 జాతీయ సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సీఐ వెంకట్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News