పెట్టుబడుల పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తతే రక్షణ: కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి
పెట్టుబడుల పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తతే రక్షణ: కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి
Krishna
పెట్టుబడుల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం కంగ్టి సీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, "మీ డబ్బులు డబుల్ అవుతాయి", "100% సురక్షిత పెట్టుబడి", "కేంద్ర ప్రభుత్వ గ్యారెంటీ" వంటి ఆకర్షణీయమైన ప్రకటనలను నమ్మి ఎలాంటి ధృవీకరణ లేకుండా డబ్బులు పెట్టుబడి పెట్టవద్దని సూచించారు. పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత సంస్థకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేదా అనేది తప్పనిసరిగా పరిశీలించాలని, అధిక లాభాలు వస్తాయని చెప్పే పథకాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అలాగే అనుమానాస్పద లింకులు, సోషల్ మీడియా పోస్టులు, ఫోన్ కాల్స్ను నమ్మవద్దని, బ్యాంకు ఖాతా వివరాలు, OTPలు, UPI PIN వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ తెలియజేయకూడదని సూచించారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 జాతీయ సైబర్ హెల్ప్లైన్కు కాల్ చేయాలని లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలని సీఐ వెంకట్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి