Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. ఇందిరా పార్క్ మహాధర్నాను జయప్రదం చేయండి: సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 14, 2026 07:57 PM

ప్రశ్నిస్తే అరెస్టులా..? ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విద్యార్థుల ఆందోళన

ప్రశ్నిస్తే అరెస్టులా..? ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విద్యార్థుల ఆందోళన

ప్రశ్నిస్తే అరెస్టులా..? ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విద్యార్థుల ఆందోళన
July 14, 2026 06:28 PM 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చలో సచివాలయం'లో ఉద్రిక్తత.. ఏఐఎస్‌ఎఫ్ నేతల అరెస్టు

విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి: ఉప్పుల శాంతికుమార్

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్‌ఎఫ్‌తో పాటు పలు వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన 'చలో సచివాలయం' కార్యక్రమం మంగళవారం ఉద్రిక్తతకు దారితీసింది. సచివాలయం వైపు భారీగా తరలివచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకు దిగిన విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు.

ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఏఐఎస్‌ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతికుమార్, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ప్రశ్నించిన వారిపై అరెస్టులతో సమాధానం చెప్పడం దురదృష్టకరమని విమర్శించారు.

వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల విడుదలపై ఆధారపడి ఉందని, నెలల తరబడి బకాయిలు చెల్లించకపోవడంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్యార్థుల డిమాండ్లను పట్టించుకోకుండా నిరసనలను అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు.

"విద్యా శాఖకు మంత్రి కరువయ్యారా..?" అంటూ ప్రభుత్వం తీరుపై ప్రశ్నించారు. వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఆందోళనలో పాల్గొన్న ఏఐఎస్‌ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా సహాయ కార్యదర్శి చిప్పలపల్లి నవీన్, నాయకులు వంశీకుమార్, ప్రశాంత్ తదితరులను పోలీసులు అరెస్టు చేసి పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు.

విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలని ఏఐఎస్‌ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News