వృద్ధాశ్రయానికి భారత్ పెట్రోలియం ఆర్థిక సాయం వీల్చైర్లు, బెడ్లు, వైద్య పరికరాల పంపిణీ
వృద్ధాశ్రయానికి భారత్ పెట్రోలియం ఆర్థిక సాయం వీల్చైర్లు, బెడ్లు, వైద్య పరికరాల పంపిణీ
Editor Desk
భారత్ పెట్రోలియం ప్రైవేట్ లిమిటెడ్ పైప్లైన్ విభాగం ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని సాగర్ రోడ్డులో ఉన్న సాయి చైతన్య సంక్షేమ వృద్ధాశ్రయానికి ఆర్థిక సాయం అందించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా వృద్ధాశ్రయానికి ఐదు వీల్చైర్లు, పది బెడ్షీట్లు, పది బెడ్లు, నాలుగు బీపీ–షుగర్ పరీక్ష యంత్రాలను అందజేశారు. అలాగే ఇస్లాంపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు 50 లీటర్ల వాటర్ ఫిల్టర్ను బహూకరించారు.
ఈ సందర్భంగా భారత్ పెట్రోలియం ఆపరేషన్స్ మేనేజర్ అంకంరావు మాట్లాడుతూ, సామాజిక బాధ్యతలో భాగంగా ప్రతి సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం వృద్ధాశ్రయంలోని వృద్ధులు, చిన్నారులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేసి వారితో కలిసి ఆనందంగా గడిపారు.
కార్యక్రమంలో వృద్ధాశ్రయం అధ్యక్షుడు డాక్టర్ నర్ర గోపాల్రెడ్డి, జి. వినోద్రెడ్డి, జె. వెంకట్రెడ్డి, హెచ్ఎం వెంకట్, భారత్ పెట్రోలియం మేనేజర్ రామ్కుమార్, ఆపరేషన్స్ మేనేజర్ అంకంరావు, రాజీవ్, పాండు, భార్గవ్, ఉదయ్, శ్రీకాంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి