పేషెంట్లకు పండ్లు పంపిణీ చేసి మానవతా సేవ చాటిన బైండ్ల కృష్ణ
పేషెంట్లకు పండ్లు పంపిణీ చేసి మానవతా సేవ చాటిన బైండ్ల కృష్ణ
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆసుపత్రి డాక్టర్ అరుణ శ్రీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి, జిల్లా ప్రధాన కార్యదర్శి బి. అఖిల్, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు ప్రభాకర్, సీనియర్ జర్నలిస్టులు విట్టల్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం రోగుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జన్మదిన వేడుకలను ఆడంబరంగా కాకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమని పేర్కొంటూ, మానవతా సేవే గొప్ప సేవ అనే సందేశంతో భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పలువురు అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి