పాముకాటు బాధిత నిరుపేద యువకుడికి అండగా గొప్ప లింగా రెడ్డి
పాముకాటు బాధిత నిరుపేద యువకుడికి అండగా గొప్ప లింగా రెడ్డి
Sthanikam District Staff Reporter
- వైద్య ఖర్చులకు రూ.5 వేల ఆర్థిక సహాయం
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తాయపల్లి గ్రామానికి చెందిన స్వర్గీయ గువ్వ రమేశ్ కుమారుడు గువ్వ శ్రీధర్ (సిద్ధులు) ఇటీవల పాముకాటుకు గురై లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న విజయ ఫార్మ్ అధినేత, తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గొప్ప లింగా రెడ్డి మంగళవారం ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు.
ఈ సందర్భంగా శ్రీధర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న లింగా రెడ్డి, బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.5,000 నగదు ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇస్తూ మనోధైర్యాన్ని కల్పించారు.ఈ కార్యక్రమంలో దత్తాయపల్లి సర్పంచ్ జేరిపోతుల కరుణాకర్,తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్,ఓబీసీ సెల్ జిల్లా కోఆర్డినేటర్ దేవరుప్పల ఐలయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దేవరుప్పల మల్లేశ్,గ్రామ శాఖ అధ్యక్షుడు,వార్డు సభ్యులు ధ్యానబోయిన నవీన్ ముదిరాజ్, గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి గొప్ప కొండల్ రెడ్డి,యువజన కాంగ్రెస్ నాయకులు తొలిచుక్క బలరాం తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి