గొరిగే నరసింహ ఆశయాలను కొనసాగించాలి. కార్మిక హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలి: ఉజ్జిని రత్నాకర్రావు
గొరిగే నరసింహ ఆశయాలను కొనసాగించాలి. కార్మిక హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలి: ఉజ్జిని రత్నాకర్రావు
Editor Desk
రామన్నపేట,
కార్మికుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు, సివిల్ సప్లై హమాలి యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొరిగే నరసింహ ఆశయాలను కొనసాగిస్తూ కార్మికులు హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని ఏఐటీయూసీ జాతీయ నాయకుడు ఉజ్జిని రత్నాకర్రావు పిలుపునిచ్చారు.
రామన్నపేట సివిల్ సప్లై గోదాం ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన నరసింహ సంతాప సభలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించి మాట్లాడారు. నరసింహ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిబద్ధతతో పనిచేసిన ఉద్యమ నాయకుడని కొనియాడారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి కార్మిక హక్కులను బలహీనపరుస్తోందని విమర్శించారు. కార్మిక వర్గానికి సిపిఐ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు బత్తుల సత్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎండీ ఇమ్రాన్, పిల్లి శంకర్, పల్లె శ్రీనివాస్, ఉట్కురి నరసింహ, ఎర్ర రమేష్, రచ్చ యాదగిరి తదితర నాయకులు, హమాలి కార్మికులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి