Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:19 AM

గొరిగే నరసింహ ఆశయాలను కొనసాగించాలి. కార్మిక హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలి: ఉజ్జిని రత్నాకర్‌రావు

గొరిగే నరసింహ ఆశయాలను కొనసాగించాలి. కార్మిక హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలి: ఉజ్జిని రత్నాకర్‌రావు

గొరిగే నరసింహ ఆశయాలను కొనసాగించాలి.  కార్మిక హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలి: ఉజ్జిని రత్నాకర్‌రావు
14-07-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

కార్మికుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు, సివిల్ సప్లై హమాలి యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొరిగే నరసింహ ఆశయాలను కొనసాగిస్తూ కార్మికులు హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని ఏఐటీయూసీ జాతీయ నాయకుడు ఉజ్జిని రత్నాకర్‌రావు పిలుపునిచ్చారు.

రామన్నపేట సివిల్ సప్లై గోదాం ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన నరసింహ సంతాప సభలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించి మాట్లాడారు. నరసింహ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిబద్ధతతో పనిచేసిన ఉద్యమ నాయకుడని కొనియాడారు.

సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చి కార్మిక హక్కులను బలహీనపరుస్తోందని విమర్శించారు. కార్మిక వర్గానికి సిపిఐ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.

ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు బత్తుల సత్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎండీ ఇమ్రాన్, పిల్లి శంకర్, పల్లె శ్రీనివాస్, ఉట్కురి నరసింహ, ఎర్ర రమేష్, రచ్చ యాదగిరి తదితర నాయకులు, హమాలి కార్మికులు పాల్గొన్నారు.

Sthanikam

గొరిగే నరసింహ ఆశయాలను కొనసాగించాలి. కార్మిక హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలి: ఉజ్జిని రత్నాకర్‌రావు

Article Image

రామన్నపేట,

కార్మికుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు, సివిల్ సప్లై హమాలి యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొరిగే నరసింహ ఆశయాలను కొనసాగిస్తూ కార్మికులు హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని ఏఐటీయూసీ జాతీయ నాయకుడు ఉజ్జిని రత్నాకర్‌రావు పిలుపునిచ్చారు.

రామన్నపేట సివిల్ సప్లై గోదాం ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన నరసింహ సంతాప సభలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించి మాట్లాడారు. నరసింహ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిబద్ధతతో పనిచేసిన ఉద్యమ నాయకుడని కొనియాడారు.

సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చి కార్మిక హక్కులను బలహీనపరుస్తోందని విమర్శించారు. కార్మిక వర్గానికి సిపిఐ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.

ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు బత్తుల సత్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎండీ ఇమ్రాన్, పిల్లి శంకర్, పల్లె శ్రీనివాస్, ఉట్కురి నరసింహ, ఎర్ర రమేష్, రచ్చ యాదగిరి తదితర నాయకులు, హమాలి కార్మికులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News