చేనేత కార్మికులకు పని కల్పించడమే ధ్యేయం. జనంపల్లి వెంకటరమణ చేనేత సహకార సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం
చేనేత కార్మికులకు పని కల్పించడమే ధ్యేయం. జనంపల్లి వెంకటరమణ చేనేత సహకార సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం
Editor Desk
రామన్నపేట
చేనేత కార్మికులకు ఏడాది పొడవునా చేతినిండా పని కల్పించి, వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేయడమే నూతన కార్యవర్గం ప్రధాన లక్ష్యమని జనంపల్లి వెంకటరమణ చేనేత సహకార సంఘం అధ్యక్షులు వనం శ్రీనివాస్ అన్నారు.
సోమవారం జనంపల్లి వెంకటరమణ చేనేత సహకార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఎన్నికల అధికారి తరుణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు వనం శ్రీనివాస్ మాట్లాడుతూ చేనేత కార్మికులందరూ ఐక్యంగా ఉండి సంఘ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. సహకార సంఘం ద్వారా కార్మికులకు నిరంతర ఉపాధి, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా ఉపాధ్యక్షులుగా ఎక్కలదేవి నరసింహ, కార్యదర్శిగా సంగిశెట్టి గోవర్ధన్, కోశాధికారిగా కైరంకొండ సరిత, డైరెక్టర్లుగా సంగిశెట్టి ధనుంజయ, సంగిశెట్టి బిక్షం, కర్నాటి నరసింహ, కైరంకొండ శ్రవణ్ కుమార్, సంగిశెట్టి అనితలు ప్రమాణ స్వీకారం చేశారు.
కార్యక్రమంలో చేనేత వృత్తిదారులు, కార్మికులు, పద్మశాలీ సంఘ సభ్యులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. కొత్త కార్యవర్గం చేనేత కార్మికుల సంక్షేమం, ఉపాధి అవకాశాల పెంపు, సంఘ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి