Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈశ్వరమ్మపై అనుచిత వ్యాఖ్యలు.. శివచరణ్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని యాదవ సంఘం డిమాండ్ నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 14, 2026 02:34 PM

చేనేత కార్మికులకు పని కల్పించడమే ధ్యేయం. జనంపల్లి వెంకటరమణ చేనేత సహకార సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

చేనేత కార్మికులకు పని కల్పించడమే ధ్యేయం. జనంపల్లి వెంకటరమణ చేనేత సహకార సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

చేనేత కార్మికులకు పని కల్పించడమే ధ్యేయం.  జనంపల్లి వెంకటరమణ చేనేత సహకార సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం
July 14, 2026 12:02 PM 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

చేనేత కార్మికులకు ఏడాది పొడవునా చేతినిండా పని కల్పించి, వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేయడమే నూతన కార్యవర్గం ప్రధాన లక్ష్యమని జనంపల్లి వెంకటరమణ చేనేత సహకార సంఘం అధ్యక్షులు వనం శ్రీనివాస్ అన్నారు.


సోమవారం జనంపల్లి వెంకటరమణ చేనేత సహకార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఎన్నికల అధికారి తరుణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు వనం శ్రీనివాస్ మాట్లాడుతూ చేనేత కార్మికులందరూ ఐక్యంగా ఉండి సంఘ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. సహకార సంఘం ద్వారా కార్మికులకు నిరంతర ఉపాధి, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.


ఈ సందర్భంగా ఉపాధ్యక్షులుగా ఎక్కలదేవి నరసింహ, కార్యదర్శిగా సంగిశెట్టి గోవర్ధన్, కోశాధికారిగా కైరంకొండ సరిత, డైరెక్టర్లుగా సంగిశెట్టి ధనుంజయ, సంగిశెట్టి బిక్షం, కర్నాటి నరసింహ, కైరంకొండ శ్రవణ్ కుమార్, సంగిశెట్టి అనితలు ప్రమాణ స్వీకారం చేశారు.


కార్యక్రమంలో చేనేత వృత్తిదారులు, కార్మికులు, పద్మశాలీ సంఘ సభ్యులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. కొత్త కార్యవర్గం చేనేత కార్మికుల సంక్షేమం, ఉపాధి అవకాశాల పెంపు, సంఘ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News