ఎస్. ఎమ్. ఎ వ్యాధి గ్రస్తుల చిన్నారులను కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయి బాధ్యత తీసుకోవాలి
ఎస్. ఎమ్. ఎ వ్యాధి గ్రస్తుల చిన్నారులను కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయి బాధ్యత తీసుకోవాలి
Harish K
కోదాడ లో మహా సంకల్పపాదయాత్రతో కోదాడ చేరుకున్న పవన్ కళ్యాణ్ పార్టీ వీరాభిమాని లక్కీ మహారాజ్ కు అభినందనలు తెలిపిన కోదాడ జనసైనికులు తదనంతరం లక్కీ మహారాజ్ చిలుకూరు గ్రామంలో ఇటీవలే హార్ట్ స్ట్రోక్ తో మరణించిన కస్తూరి సురేష్ చిత్ర పటానికి శ్రద్ధాంజలి ఘటించి సురేష్ కుటుంబాన్ని పరామర్శించి తమ పరిస్థితులను పవన్ కళ్యాణ్ వద్దకు తెలియజేసే ప్రయత్నం చేస్తానని అన్నారు. తదనంతరం కోదాడ రంగా థియేటర్ చౌరస్తా వద్ద ఉన్న వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాల వేసి జోహార్లు పలికారు ఈ సందర్భంగా లక్కీ మహారాజ్ మాట్లాడుతూ మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ మండల్ పోతన్ పల్లి గ్రామం నుండి జులై 05 వ తేదీ రోజునుండి జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి టెంపుల్ నందు దర్శనం చేసుకుని హైదరాబాద్ నుండి మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ కి పాదయాత్ర చేపట్టినట్లు.ఆయన తెలియజేశారు దేశంలో SMA వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత వైద్యం అందించాలని పార్టీలకు అతీతంగా ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు మీడియా తో తెలిపారు సమాజానికి SMA వ్యాధి భవిష్యత్తులో వ్యాప్తి చెందకుండా ఎవరికి రాకుండా ముందగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. నా ఈ సేవ పూరితపు ఆలోచన సమాజానికి మేలు జరిగేలా ఉండాలనే ఉద్దేశంతో ప్రజల్లోకి చేరే విధంగా సంకల్ప పాదయాత్రను చేపట్టినట్లు ఇట్టి తన ప్రయత్నాన్ని దేశ ప్రధాన ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి చేరేలా సామాజిక నేపథ్యంతో కొనసాగుతున్న అంశాన్ని చేరవేలని కోరారు.ఇట్టి కార్యక్రమంలో జనసేన కంటెంట్ అభ్యర్థులు రాయల సతీష్, మాగి కళ్యాణ్ మారోజు తిరుమలచారి శెట్టి సూర్యప్రకాశ్ నాయుడు సంధ్య నాయుడు పలువురు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి