PRINT TIME: July 14, 2026 07:14 AM
మహాశివాక్ష యోగంలో భక్తుల సందడి.. శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు
మహాశివాక్ష యోగంలో భక్తుల సందడి.. శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు
July 14, 2026 04:43 AM
2 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
చిట్యాల: వందేళ్లకు ఒకసారి వస్తుందని విశ్వసించే అత్యంత అరుదైన మహాశివాక్ష యోగం సందర్భంగా సోమవారం చిట్యాల పట్టణంలోని శివాలయంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ పవిత్ర యోగంలో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే సకల పాపాలు తొలగి, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలుగుతాయని నమ్మకం ఉండటంతో భక్తులు ఉదయం నుంచే ఆలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ చైర్పర్సన్ పందిరి గీతా రమేష్, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు వనమా వెంకటేశ్వర్లు, వనమా హైమా అరుంధతి, శివాలయ కమిటీ చైర్మన్ రంగా వెంకటేశ్వర్లు, నరేందర్ రెడ్డి, సకినాల సుధాకర్ దంపతులు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి