Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నీటి సరఫరా పునరుద్ధరించండి మహా ప్రభో నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 14, 2026 07:14 AM

మహాశివాక్ష యోగంలో భక్తుల సందడి.. శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు

మహాశివాక్ష యోగంలో భక్తుల సందడి.. శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు

మహాశివాక్ష యోగంలో భక్తుల సందడి.. శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు
July 14, 2026 04:43 AM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


చిట్యాల: వందేళ్లకు ఒకసారి వస్తుందని విశ్వసించే అత్యంత అరుదైన మహాశివాక్ష యోగం సందర్భంగా సోమవారం చిట్యాల పట్టణంలోని శివాలయంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ పవిత్ర యోగంలో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే సకల పాపాలు తొలగి, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలుగుతాయని నమ్మకం ఉండటంతో భక్తులు ఉదయం నుంచే ఆలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీతా రమేష్, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు వనమా వెంకటేశ్వర్లు, వనమా హైమా అరుంధతి, శివాలయ కమిటీ చైర్మన్ రంగా వెంకటేశ్వర్లు, నరేందర్ రెడ్డి, సకినాల సుధాకర్ దంపతులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News