Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:36 AM

మహాశివాక్ష యోగంలో భక్తుల సందడి.. శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు

మహాశివాక్ష యోగంలో భక్తుల సందడి.. శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు

మహాశివాక్ష యోగంలో భక్తుల సందడి.. శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు
14-07-2026 138 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


చిట్యాల: వందేళ్లకు ఒకసారి వస్తుందని విశ్వసించే అత్యంత అరుదైన మహాశివాక్ష యోగం సందర్భంగా సోమవారం చిట్యాల పట్టణంలోని శివాలయంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ పవిత్ర యోగంలో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే సకల పాపాలు తొలగి, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలుగుతాయని నమ్మకం ఉండటంతో భక్తులు ఉదయం నుంచే ఆలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీతా రమేష్, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు వనమా వెంకటేశ్వర్లు, వనమా హైమా అరుంధతి, శివాలయ కమిటీ చైర్మన్ రంగా వెంకటేశ్వర్లు, నరేందర్ రెడ్డి, సకినాల సుధాకర్ దంపతులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మహాశివాక్ష యోగంలో భక్తుల సందడి.. శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు

Article Image


చిట్యాల: వందేళ్లకు ఒకసారి వస్తుందని విశ్వసించే అత్యంత అరుదైన మహాశివాక్ష యోగం సందర్భంగా సోమవారం చిట్యాల పట్టణంలోని శివాలయంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ పవిత్ర యోగంలో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే సకల పాపాలు తొలగి, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలుగుతాయని నమ్మకం ఉండటంతో భక్తులు ఉదయం నుంచే ఆలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీతా రమేష్, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు వనమా వెంకటేశ్వర్లు, వనమా హైమా అరుంధతి, శివాలయ కమిటీ చైర్మన్ రంగా వెంకటేశ్వర్లు, నరేందర్ రెడ్డి, సకినాల సుధాకర్ దంపతులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News