SIR ఓటరు నమోదులో వేగం పెంచాలి.. కాంగ్రెస్ SIR ఇంచార్జి నల్ల బుచ్చన్న
SIR ఓటరు నమోదులో వేగం పెంచాలి.. కాంగ్రెస్ SIR ఇంచార్జి నల్ల బుచ్చన్న
Reporter shekar
ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొండాపూర్, ముసినగర్, గడుకోల్, తుంపల్లి గ్రామాల SIR ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా ఇన్చార్జిగా నియమితులైన కొండాపూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నల్ల బుచ్చన్న గ్రామాల్లో పర్యటించి ఓటరు నమోదు యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అలాగే ఇప్పటివరకు నమోదైన ఆన్లైన్ ఓట్ల వివరాలను సమీక్షించారు.
కొండాపూర్ గ్రామం:
• బూత్-283: మొత్తం 891 ఓట్లకు గాను 556 ఆన్లైన్ నమోదు – 63%
• బూత్-284: మొత్తం 907 ఓట్లకు గాను 520 ఆన్లైన్ నమోదు – 57%
• బూత్-285: మొత్తం 765 ఓట్లకు గాను 441 ఆన్లైన్ నమోదు – 58%*
గడుకోల్ గ్రామం:
• బూత్-279: మొత్తం 676 ఓట్లకు గాను 472 ఆన్లైన్ నమోదు – 69%
• బూత్-280: మొత్తం 753 ఓట్లకు గాను 450 ఆన్లైన్ నమోదు – 60%
• బూత్-281: మొత్తం 662 ఓట్లకు గాను 388 ఆన్లైన్ నమోదు – 58%
• బూత్-282: మొత్తం 642 ఓట్లకు గాను 351 ఆన్లైన్ నమోదు – 54%
ముసిర్ నగర్ గ్రామం:
• బూత్-286: మొత్తం 1215 ఓట్లకు గాను 900 ఆన్లైన్ నమోదు – 70%
ఈ సందర్భంగా నల్ల బుచ్చన్న మాట్లాడుతూ, ఓటరు నమోదు ప్రక్రియకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉన్నందున, ఇంకా నమోదు చేసుకోని అర్హులైన ప్రతి ఒక్కరూ వెంటనే తమ ఓటును నమోదు చేసుకోవాలని కోరారు. అలాగే గ్రామాల్లోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, యువకులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములై ప్రతి అర్హుడితో ఓటరు నమోదు చేయించాలని విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి